'నో ఇన్-నో అవుట్...', నిర్మలమ్మ నోరువిప్పే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సంగతి మీకు తెలిసిందే. దీనికి ముందు మీరు బడ్జెట్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వాస్తవాలలో ఒకటి ఏమిటంటే, బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు దాని తయారీలో పాల్గొన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అలాగే ఉద్యోగులు చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, అది కూడా మొత్తం 10 రోజుల పాటు లాక్‌డౌన్ లాంటి వాతావరణంలో ఉంచుతారు. వీరు వారి కుటుంబ సభ్యులకు కాల్ చేయడానికి లేదా మాట్లాడటానికి లేదా ఇమెయిల్‌లు, చాటింగ్ చేయడానికి కూడా అనుమతించరు. ఒకవేళ అనారోగ్యనికి గురైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు కూడా వీలు లేదు. దీన్ని బట్టి ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

నార్త్ బ్లాక్‌లో 'నో ఇన్, నో అవుట్'
బడ్జెట్ పేపర్స్ తయారీ నుండి ప్రింటింగ్ వరకు గట్టి భద్రత ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ రూపొందించడానికి ముందు నార్త్ బ్లాక్‌లోని మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి బయటి వ్యక్తులు లేదా మీడియా ఎంట్రీ పూర్తిగా నిషేధిస్తారు. ఈ బడ్జెట్‌ పేపర్లను ముద్రించే ప్రక్రియలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి ఏ రకమైన వ్యక్తి అయినా ప్రవేశించడం పూర్తిగా లిమిట్ చేస్తారు, అయితే మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులు ఆఫీస్ సిస్టంలో పర్సనల్ ఇ-మెయిల్‌ ఉపయోగించలేరు. CISF కాకుండా, ఢిల్లీ పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు నార్త్ బ్లాక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ల వద్ద మోహరిస్తారు. బడ్జెట్ మేకింగ్ అధికారులను కలవడానికి వెళ్లే వారిపై అందరు ఓ కన్నేసి ఉంచుతారు.

No in no out lockdown like atmosphere those 10 days before budget presentation

బడ్జెట్‌ను రూపొందించే వారిని 10 రోజుల పాటు
ఈ బడ్జెట్‌ పేపర్స్ తయారీ సమయంలో దానిలో పాల్గొన్న అధికారులు ఇంకా ఉద్యోగులు పటిష్టమైన నియంత్రణలో ఉంటారు. విశేషమేమిటంటే పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందు ఈ అధికారులు ఇంకా ఉద్యోగులు ప్రపంచంతో డిస్‌కనెక్ట్ అవుతారు. ఇది నిజం, ఈ కాలంలో ఈ అధికారులు, ఉద్యోగులు వారి కుటుంబాలతో కూడా మాట్లాడలేరు. అయితే, ఈ పనితో సంబంధం ఉన్న ఆర్థిక మంత్రికి చాలా సీనియర్ అండ్ విశ్వసనీయ అధికారులు మాత్రమే ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారు. మిగిలిన ఉద్యోగులు అలాగే అధికారుల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ 'లాక్‌డౌన్' విధించినట్లు కనిపిస్తోంది.

మీరు అనారోగ్యానికి గురైతే మీరు ఆసుపత్రికి వెళ్లలేరు మరియు
బడ్జెట్ భద్రతా వ్యవస్థ అలాగే దాని ప్రాముఖ్యతను కూడా ఈ 10 రోజుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారులు ఇంకా ఉద్యోగులలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అక్కడే ఉండాలి. ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. వారికి ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు వైద్యుల బృందం కూడా నార్త్ బ్లాక్‌లోనే ఉంటుంది.

బడ్జెట్ పేపర్స్
పార్లమెంట్‌లో 10 రోజుల ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బేస్‌మెంట్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో బడ్జెట్ పేపర్స్ ముద్రిస్తారు. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం, బడ్జెట్ పేపర్స్ పార్లమెంటులో సమర్పించే వరకు ఇవి ఒక రకమైన సీక్రెట్ పేపర్స్. బడ్జెట్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం లీక్ అయితే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అందుకే, బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు ప్రజలకు తెలియకుండా దాచిపెట్టి ఇలాంటి ఆంక్షలు విధించారు.

ఇంతకు ముందు
బడ్జెట్‌ చరిత్రను పరిశీలిస్తే 1950 సంవత్సరం వరకు రాష్ట్రపతి భవన్‌లోని ప్రెస్‌లో బడ్జెట్‌ పేపర్స్ ముద్రించేవారు, అయితే బడ్జెట్‌లో కొంత భాగం అక్కడి నుంచి లీక్ అయింది. ఆ తర్వాత దానిని మింట్లో 1980 సంవత్సరం నుండి నార్త్ బ్లాక్‌లోని ప్రెస్‌లో బడ్జెట్‌ను ముద్రించడం ప్రారంభించారు. బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి ముందు బ్లూ షీట్ తయారు చేస్తారు, దీనిలో ఆర్థిక డేటా ఉంటుంది. దీని ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందిస్తారు. ఆర్థిక మంత్రి కూడా ఈ బడ్జెట్ షీట్‌ను బయటకు తీయలేరు అలాగే దీని పూర్తి బాధ్యత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (బడ్జెట్)పై ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+