జీఎస్టీ కంపెన్షేషన్ సెస్ విషయంలో కేంద్రం తీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(CAG) తప్పుబట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. జీఎస్టీ పరిహార సెస్ను మళ్లించలేదని తెలిపింది. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.47,272 కోట్ల మొత్తం పరిహారాన్ని కేంద్రం తన వద్దే ఉంచుకొని, ఇతర అవసరాలకు వినియోగించిందని కాగ్ ఇటీవల నివేదిక ఇచ్చింది. అయితే నిధులు తాత్కాలికంగా అట్టిపెట్టుకోవడమంటే ఇతర అవసరాలకు మళ్లించినట్లు కాదని ఆర్థిక శాఖ తెలిపింది.

ఇతర అవసరాలకు నిధులు..
జీఎస్టీ అమలు కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలకు పరిహారంగా సెస్సును కేంద్రం ఇవ్వాల్సి ఉందని కాగ్ పేర్కొంది. సెస్ల రూపంలో వసూలైన మొత్తాన్ని కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా(CFI)కి బదలీ చేయాల్సి ఉందని తెలిపింది. 2017-18లో రూ.62,612 కోట్ల మేర సెస్ వసూలు కాగా, రూ.56,146 కోట్లు ఆ నిధికి బదలీ చేశారని, 2018-19లో రూ.95,081 కోట్లు వసూలు కాగా, రూ.54,275 కోట్లు బదలీ అయ్యాయని పేర్కొంది. ఆ రెండేళ్లలో రూ.47,272 కోట్లు తక్కువగా ఆ నిధికి బదలీ అయ్యాయని కాగ్ పేర్కొంది. ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించినట్లు నివేదికలో వెల్లడించింది.

రెండేళ్లలో ఇలా తగ్గుదల..
ది జీఎస్టీ కంపెన్షేషన్ సెస్ యాక్ట్ 2017 కింద విధించిన సెస్ను జీఎస్టీ అమలు కారణంగా ఆదాయ నష్టం కలిగిన రాష్ట్రాలకు పరిహారంగా ఇవ్వాలని కాగ్ పేర్కొంది. 2017-18లో రూ.6,466 కోట్లు, 2018-19లో రూ.40,806 కోట్లు తక్కువగా బదలీ అయినట్లు తెలిపింది. అంటే మొత్తం రూ.47,272 కోట్లు తక్కువగా బదలీ అయినట్లు తెలిపింది. ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించిందని, దీంతో ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు, ద్రవ్యలోటు తక్కువగా నమోదయినట్లు తెలిపింది.

అంతకంటే ఎక్కువ చెల్లింపులు జరిగాయి
ఆర్థిక శాఖ దీనిపై స్పందిస్తూ రెండు సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు కేంద్రం చెల్లించిందని తెలిపింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.95,444 కోట్లు వసూలు కాగా, రాష్ట్రాలకు అంతకంటే ఎక్కువగా రూ.1,65,302 కోట్లు కేంద్రం విడుదల చేసిందని గుర్తు చేసింది. నిధుల సర్దుబాటు కారణంగా తాత్కాలికంగా అట్టిపెట్టుకుంటే నిధులు మళ్లించినట్లు పేర్కొనడం సరికాదని తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications