ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం (8వ CPC)కు సంబంధించిన నిబంధనలు వెలువడిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లలో అనేక సందేహాలు, భయాలు తలెత్తాయి. జీతాలు, డీఏ పెంపు, పెన్షన్ సవరణలు వంటి అంశాలపై స్పష్టత లేకపోవడంతో.. సోషల్ మీడియాలో అనేక తప్పుదారి పట్టించే సందేశాలు వైరల్ అయ్యాయి. దీని వల్ల లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిన ఒక సందేశంలో.. ఆర్థిక చట్టం-2025 ద్వారా కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు డీఏ పెంపుదల, వేతన సంఘం ఆధారిత సవరణలు వంటి ముఖ్యమైన ప్రయోజనాలను రద్దు చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో 8వ వేతన సంఘం ప్రయోజనాలు పెన్షనర్లకు వర్తించవని ఓ సందేశం వైరల్ చేస్తున్నారు.

ఈ వాదనలను కేంద్ర ప్రభుత్వ అధికారిక వాస్తవ తనిఖీ విభాగమైన PIB ఫ్యాక్ట్ చెక్ పూర్తిగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించిన డీఏ, డీఆర్ లేదా వేతన సంఘం ప్రయోజనాలను ఎక్కడా రద్దు చేయలేదని PIB స్పష్టంగా ప్రకటించింది. పెన్షన్లు, పదవీ విరమణ ప్రయోజనాలపై సోషల్ మీడియాలో వచ్చే అసత్య సమాచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
PIB ఫ్యాక్ట్ చెక్ ప్రకారం..కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఈ క్రింది ప్రయోజనాలను పూర్తిగా పొందుతూనే ఉంటారని స్పష్టమయింది. భవిష్యత్తులో 8వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా పెన్షన్ సవరణలు అమలు అవుతాయి. ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేయడానికి ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో డీఆర్ పెంపులు కొనసాగుతాయి.
ఈ గందరగోళానికి ప్రధాన కారణం CCS (పెన్షన్) నియమాలు, 2021లో చేసిన ఒక పరిమిత సవరణ. ఈ సవరణ, ప్రభుత్వ సేవల నుంచి తొలగించబడి తరువాత PSUలో విలీనం అయిన ఉద్యోగులు, తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడిన సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుందని PIB స్పష్టం చేసింది. ఇది సాధారణంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు లేదా నిజాయితీగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. ఈ మార్పు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన సూరజ్ ప్రతాప్ సింగ్ వర్సెస్ CMD, BSNL కేసు తీర్పు ఆధారంగా జరిగింది.
ఈ అంశంపై పార్లమెంటులో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్లు కూడా వస్తాయని తెలిపింది. జీతాలు, అలవెన్సులు, పెన్షన్లపై సమగ్ర సిఫార్సులు చేయడమే 8వ వేతన సంఘం బాధ్యత అని సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. డీఏ, డీఆర్ను ప్రాథమిక వేతనంలో విలీనం చేసే అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని ప్రభుత్వం తెలిపింది. 8వ వేతన సంఘం నివేదిక వచ్చిన తర్వాత.. అంటే 2027 నాటికి, ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వైరల్ అవుతున్న వాట్సాప్ సందేశాలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి. PIB ఫ్యాక్ట్ చెక్, ప్రభుత్వం రెండూ వాటిని ఖండించాయి. కాబట్టి పెన్షనర్లు పుకార్లకు భయపడాల్సిన అవసరం లేదు. అధికారిక సమాచారాన్నే నమ్మాలని కేంద్రం కోరింది.
More From GoodReturns

Bengaluru: క్యాబ్లోనే వంట, ఆఫీస్ వర్క్.. బెంగళూరు ట్రాఫిక్పై జర్మన్ యువతి జోకులు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications