స్థిరంగానే పెట్రోల్ ధరలు, డెలివరీ ఏజెంట్లకు పెరుగుతున్న ఇబ్బంది
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం, మే 20వ తేదీన ధరలో ఎలాంటి మార్పులేదు. చివరిసారి 6, ఏప్రిల్ రోజున లీటర్ పెట్రోల్ పైన పెరిగింది. మార్చి 22వ తేదీ నుండి పక్షం రోజుల పాటు మొత్తం రూ.10 వరకు పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా నెలకు పైగా స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41, లీటర్ డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. గురుగ్రామ్లో పెట్రోల్ రూ.105.86, డీజిల్ రూ.97.10గా ఉంది.
మార్చి 22వ తేదీ నుండి దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను సవరిస్తున్నాయి. నవంబర్ 4వ తేదీ నుండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. నాలుగున్నర నెలల పాటు స్థిరంగా ఉన్న ధరలు మార్చి 22వ తేదీ వరకు స్థిరంగానే కొనసాగాయి. ఆ తర్వాత పది రోజుల పాటు సవరించారు. తిరిగి స్థిరంగా కొనసాగుతున్నాయి.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, కోల్కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, బెంగళూరులో పెట్రోల్ రూ.111.09, డీజిల్ రూ.94.79గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49 వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పలు ప్రాంతాల్లో సెంచరీని క్రాస్ చేశాయి. రాజస్థాన్లోని శ్రీ గంగాధరలో లీటర్ పెట్రోల్ రూ.123కు చేరుకుంది. ఇక్కడ డీజిల్ రూ.105.31గా ఉంది. బ్రెంట్ క్రూడ్ ధరలు 108 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 107 డాలర్ల వద్ద ఉంది.
పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఫుడ్ డెలివరీ, ఇతర డెలివరీ బాయ్స్కు ఇబ్బందికరంగా మారాయి. భారత్ వ్యాప్తంగా వందలాదిమంది డెలివరీ ఏజెంట్లు ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మున్ముందు కనీసం రూ.2 నుండి రూ.5 పెరగవచ్చునని తెలుస్తోంది. పెట్రోల్ ధరలు కవర్ చేయడానికి కొన్ని సంస్థలు గత ఏడాది డెలివరీ బాయ్స్ వేతనాలను ఏడు శాతం నుండి 8 శాతం పెంచాయి. ఇటీవల ధరలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు వేతన సవరణ కోసం చూస్తున్నారు.