Reliance News: ముఖేష్ స్థానంలోకి నీతా అంబానీ..! రిలయన్స్ కంపెనీలో పెద్ద అడుగు..
Nita Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ డిస్నీని కొనుగోలు చేయాలని అంబానీ నిర్ణయించారు. ఈ క్రమంలో మెర్జర్ తర్వాత.. అంబానీకి చెందిన వయాకామ్-18 కంపెనీలో 51 శాతం వాటాలను కలిగి ఉండనుంది.
ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన కంపెనీకి బోధి ట్రీ ప్రమోటర్ శంకర్ వయాకామ్ 18-సోనీ ఇండియా జాయింట్ వెంచర్కు వైస్-ఛైర్పర్సన్గా ఉండే అవకాశం ఉంది. ఇదే క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు ఛైర్పర్సన్ అయిన నీతా అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్-వాల్ట్ డిస్నీ విలీన మీడియా వ్యాపారానికి చైర్పర్సన్ కావచ్చని తెలుస్తోంది. ఫౌండేషన్పై ఎక్కువ దృష్టి పెట్టడానికి నీతా అంబానీ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుండి రాజీనామా చేశారని మీకు తెలియజేద్దాం.ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకురాలు కూడా.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్-డిస్నీ విలీన యూనిట్ బోర్డు చైర్పర్సన్గా నియమితులయ్యే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. రిలయన్స్- సోనీకి చెందిన డిస్నీ ఇండియా మీడియా విలీన ఒప్పందంపై సంతకం చేయడానికి దగ్గరగా ఉన్నాయి. ఈ డీల్కు సంబంధించిన పనులు నెలల తరబడి సాగుతున్నాయి. దీనికి సంబంధించిన బైండింగ్ అగ్రిమెంట్ ఇటీవల రెండు సంస్థల మధ్య జరిగినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం విలీన యూనిట్లో రిలయన్స్కు 51 శాతం వాటా ఉండవచ్చు. జేమ్స్ మర్డోక్, ఉదయ్ శంకర్ మధ్య జాయింట్ వెంచర్ అయిన బోధి ట్రీ 9 శాతం వాటాను తీసుకోనుండగా, డిస్నీ 40 శాతం వాటాను కలిగి ఉంటుడనున్నాయి. అధికారిక ప్రకటనకు ముందు పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇప్పటి వరకు ఈ వివరాలపై డిస్నీ లేదా రిలయన్స్ స్పందించలేదు.


Click it and Unblock the Notifications