ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీ తన పునరుద్ధరణ చర్యలలో భాగంగా టోక్యోకు నైరుతి దిశలోని యోకోహామాలో ఉన్న ప్రధాన కార్యాలయ భవనాన్ని 97 బిలియన్ యెన్లకు (630 మిలియన్ డాలర్లు) విక్రయించినట్లు గురువారం ప్రకటించింది. నిస్సాన్ ఈ భవనాన్ని అమ్మిన తర్వాత కూడా లీజు తీసుకుని దానిని తన ప్రధాన కార్యాలయంగానే కొనసాగించనుంది. టోక్యో కేంద్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థ MJI గోడో కైషా ఈ ఆస్తిని కొనుగోలు చేసింది.
ఈ అమ్మకం ద్వారా నిస్సాన్ 73.9 బిలియన్ యెన్లు (480 మిలియన్ డాలర్ల) లాభాలు పొందనుందని సంస్థ ప్రకటించింది. నిస్సాన్ ప్రకటన ప్రకారం ఈ ఆస్తి విక్రయం ద్వారా వచ్చిన నిధులను ప్రధాన కార్యాలయంలోని అంతర్గత వ్యవస్థలను ఆధునీకరించడానికి, అలాగే కంపెనీ కార్యకలాపాల్లో AI ఆధారిత సాంకేతికతలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆటోమేషన్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి వినియోగించనున్నారు.

ఈ భవనాన్ని కొనుగోలు చేసిన MJI గోడో కైషా అనేది హాంకాంగ్లో జాబితా చేయబడిన ఆటో విడిభాగాల తయారీ సంస్థ మింత్ గ్రూప్ యాజమాన్యంలో ఉన్న ప్రత్యేక ప్రయోజన ట్రస్ట్. అయితే లీజు అద్దె మొత్తాన్ని సంస్థ వెల్లడించలేదు. ఇటీవలి కాలంలో నిస్సాన్కు ఆర్థికంగా కష్ట సమయాలు ఎదురవుతున్నాయి. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంస్థ 670.9 బిలియన్ యెన్లు (4.4 బిలియన్ డాలర్లు) నష్టాన్ని నమోదు చేసింది.
గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఎలక్ట్రిక్ వాహన (EV) పోటీతో నిస్సాన్ లాభదాయకతను తిరిగి సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో నిస్సాన్లో దాదాపు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న మెక్సికన్ మూలాలున్న ఇవాన్ ఎస్పినోసా సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో సంస్థ కొత్త వ్యూహాత్మక దిశలో అడుగులు వేస్తోంది.
నిస్సాన్ తన ప్రకటనలో ఈ చర్య సవాళ్లతో కూడిన ఆర్థిక సంవత్సరాల్లో పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి నాన్-కోర్ ఆస్తుల నుండి మూలధన సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి క్రమశిక్షణా విధానాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. కంపెనీ ప్రకారం భవిష్యత్ వృద్ధి, పరిశోధన, పోటీతత్వం, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఈ అమ్మకం కీలకపాత్ర పోషించనుంది. రాబోయే దశాబ్దంలో నిస్సాన్ ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), AI ఆధారిత డ్రైవింగ్ టెక్నాలజీలు, గ్రీన్ ఎనర్జీ వనరులు వైపు దృష్టి సారించనుంది.
ఇప్పటికే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తన శ్రామికశక్తిలో దాదాపు 15 శాతం (20,000 మంది) ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా జపాన్లోని ఒప్పమా ప్లాంట్ ను మూసివేయడానికి కూడా నిస్సాన్ సిద్ధమవుతోంది. ప్రపంచ మార్కెట్లో టయోటా, హోండా వంటి ప్రత్యర్థులతో పోటీ పడటానికి, మారుతున్న ఆటోమొబైల్ ట్రెండ్స్కి తగినట్టుగా సర్దుబాటు చేసుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications