BJP Won Delhi Elections: దశాబ్ధకాలంగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ బీజేపీకి ఇన్నాళ్లుగా ఒక లోటును చూసింది. అదే దేశ రాజధాని దిల్లీ గడ్డమీద తన పెత్తనం చెలామణి కుదరకపోవటం. కేజ్రీవాల్ ఇన్నాళ్లుగా కొరకరాని కొయ్యగా మారటంతో బీజేపీ సమయం కోసం ఎదురుచూసింది. ప్రస్తుతం 27 ఏళ్ల తర్వాత దిల్లీలో గెలుపు మోదీ సర్కారు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా బలపరుస్తోంది.
అయితే దిల్లీలో అధికారం దక్కించుకోవటానికి బీజేపీకి ఎలాంటి అంశాలు కలిసివచ్చాయనే చర్చ ఇప్పుడు ముమ్మరంగా సాగుతోంది. ప్రధానంగా దిల్లీలోని మధ్యతరగతి ప్రజలు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన రూ.12 లక్షల ఆదాయపన్ను పరిమితి పెంపుపై సంతృప్తిని పొందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలో బీజేపీ తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్ ముస్లిం ఓటర్లను బీజేపీ వైపు తిప్పిందని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానంగా ఈసారి బడ్జెట్లో కేంద్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు పెంపుతో పెద్ద ఉపశమనాన్ని ఇవ్వటం వారి కొనుగోలు శక్తిని పెంచుతుందని ప్రజలు భావించారు. దీని ప్రభావం 2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక విభాగం ఓటింగ్ ప్రాధాన్యతలను కూడా ప్రభావం చూపిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఓట్ల రూపంలో బీజేపీకి దేశరాజధానిలో విజయం అందించిందని వారు చెబుతున్నారు.
బడ్జెట్ తర్వాత బీజేపీ 'మధ్యతరగతి-స్నేహపూర్వక' బడ్జెట్ 2025ను ప్రశంసిస్తూ దిల్లీ ఎన్నికల గురించి వార్తాపత్రిక ప్రకటనను విడుదల చేయటం ఎన్నికల సరళిపై ప్రభావాన్ని చూపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2015-2020 మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పేద, అల్పాదాయ, మధ్య-ఆదాయ ఓటర్ల అంతరాన్ని తగ్గించుకుంది. గత ఎన్నికల్లో ఆప్ బీజేపీ కంటే 15 శాతం అధిక ఓట్లను కలిగి ఉండగా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
కేజ్రీవాల్ సర్కార్ క్లీన్ గవర్నెన్స్ ఇమేజ్ను ఎదుర్కోవటానికి దశాబ్ధకాలంగా బీజేపీ ప్రయత్నిస్తూ వచ్చింది. అయితే ఎన్నికలకు ముందు ఆప్ ప్రభుత్వంలోని పెద్దలు లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ జైలుకు వెళ్లటం కూడా బీజేపీకి కలిసొచ్చింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications