కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మార్చి 24) మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ అనుసంధాన వేదిక ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, దేశాన్ని గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వివిధ రాష్టాలలో లాక్ డౌన్ ప్రకటించారు.
ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, ఈ నేపథ్యంలో తాను మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడుతానని ఆమె తెలిపారు. ముఖ్యంగా స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ అంశాలపై మాట్లాడుతానని తెలిపారు.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పదహారున్నర వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇండియాలో పది మంది మరణించారు. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం స్తంభించింది. ఆయా దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, కార్పోరేట్ వ్యవస్థ నుండి సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!



Click it and Unblock the Notifications