మధ్యాహ్నం గం.2కు మీడియాతో మాట్లాడనున్న నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మార్చి 24) మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ అనుసంధాన వేదిక ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, దేశాన్ని గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వివిధ రాష్టాలలో లాక్ డౌన్ ప్రకటించారు.

ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని, ఈ నేపథ్యంలో తాను మధ్యాహ్నం రెండు గంటలకు మీడియాతో మాట్లాడుతానని ఆమె తెలిపారు. ముఖ్యంగా స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ అంశాలపై మాట్లాడుతానని తెలిపారు.

 Nirmala Sitharaman will address the media at 2 PM

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పదహారున్నర వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇండియాలో పది మంది మరణించారు. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం స్తంభించింది. ఆయా దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే, కార్పోరేట్ వ్యవస్థ నుండి సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+