భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. ఇండియా ఇంక్ కి ఉపదేశాలు చేశారు. పరిశ్రమ తనలో దాగి ఉన్న భయాలు, అనుమానాలు వీడి, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే... శుక్రవారం. దేశంలోని ప్రముఖ పరిరమికవేత్తలతో జరిగిన ఒక సమావేశంలో నిర్మల సీతారామన్ ఈ మేరకు క్లాస్ పీకారు. బడ్జెట్ కు ముందస్తు సన్నాహాల్లో భాగంగా ఆమె రెండో రోజు కూడా కొంత మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.
ఆ సందర్భంగా ప్రస్తుతం దేశంలోని పారిశ్రామికవేత్తలు సొంత అనుమానాలతో (సెల్ఫ్ డౌట్) ఉన్నారని, మనం చేయగలమా, ఇండియా ఇది చేయగలదా అంటూ అనుమానాస్పదంగా చూస్తున్నారని, అలాంటి నెగెటివ్ ఆలోచనలను వదిలేయాలని ఆర్థిక మంత్రి వారిని కోరారు. అదే సమయంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగాలే ఉన్నాయని, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసారు.
అందుకే రెట్టించిన ఆటం విశ్వాసంతో ముందుకు సాగాలని, అందివచ్చే అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. దేశ ఆర్థిక మంత్రి ఇలా క్లాస్ తీసుకోవటం సమావేశానికి హాజరైన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని సమాచారం.

బిడ్స్ వేయండి...
కొంత కాలం నుంచి తాము తీసుకుంటున్న చర్యలతో దేశం ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఎదుగుతుందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. అలాంటి నిర్ణయాల్లో ఒకటైన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో పాలుపంచుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కాంకర్) వంటి కంపెనీల కొనుగోలుకు బిడ్డింగ్ దాఖలు చేయాలనీ చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని దేశీయ కంపెనీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. అద్భుతమైన కంపెనీలను మన దేశ కంపెనీలే కొనుగోలు చేయాలనీ భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తద్వారా పారిశ్రామికవేత్తలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు.

మేము రెడీ.....
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అభ్యర్థనకు పారిశ్రామికవేత్తలు కూడా సానుకూలంగా స్పందించారు. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ... పెట్టుబడుల ఉపసంహరన ద్వారా ప్రభుత్వం సుమారు రూ 1 లక్ష కోట్లు సమీకరించగలదని తాము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, కొనుగోలు తర్వాత తక్కువ అప్పులు ఉండే కంపెనీల కొనుగోలుకు భారత పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపుతాయని చెప్పారు. తాము బీపీసీఎల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. భారత్ లో ఒక్క కంపెనీ కూడా మూతపడటం తమకు ఇష్టంలేదని, అందరూ ఎదిగేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని నిర్మల పేర్కొన్నారు. ఇందుకోసం దివాళా ప్రక్రియ ల కోసం కోడ్ ను పటిష్టం చేస్తున్నామని చెప్పారు.

ఫలితాలు వస్తున్నాయి...
బడ్జెట్ అనంతరం ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల ఫలితాయి కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా కార్పొరేట్ పన్ను తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. దీనిపై పారిశ్రామికవేత్తలు మరింత స్పష్టత కోరుతున్నారని, అదే తమ పనితీరుకు తార్కాణమన్నారు. ఇటీవల పార్టనర్షిప్ ఫర్మ్ లు, లిమిటెడ్ లిబిలిటీలను కూడా తక్కువ పన్ను చెల్లింపు పరిధిలోకి తేవాలని అభ్యర్థిస్తున్నారని నిర్మల తెలిపారు. జీఎస్టీ మొత్తం అధికారులతో సంబంధం లేని పేస్ లెస్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించామని, అధికారుల వేధింపులు ఇకపై ఉండబోవని స్పష్టం చేసారు. బ్యాంకులకు కూడా స్వేచ్ఛ ఇచ్చామని, వాటి పని అవి చేసుకుపోయేలా చూశామన్నారు. అన్ని రంగాలకు ప్రోత్సాహం కొనసాగుతుందని నిర్మల సీతారామన్ చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications