ఆందోళన అవసరం లేదు, సర్దుకుంటుంది: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యంలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. వృద్ధి రేటు కొద్దిగా మందగించి ఉండవచ్చునని, కానీ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితి లేదన్నారు. తొలి బడ్జెట్ అనంతరం తీసుకున్న ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని, ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయని చెప్పారు.

స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 7నెలల్లో జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల కనిపించిందన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రంగాలకు ఉద్దీపనలు ప్రకటించామని, కార్పొరేట్ పన్ను తగ్గించామని గుర్తు చేశారు. దివాలా చట్టం తదితర సంస్కరణల ఫలాలు కనిపిస్తున్నాయని చెప్పారు.

Nirmala Sitharaman speech on economy fails to impress ministers

బ్యాంకింగ్ రంగం ఒత్తిడిలో ఉండటం, ఎన్పీఐలు ప్రమాదకరస్థాయికి చేరడంవల్లే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ క్షీణించిందని చెప్పారు. ఈ పరిస్థితికి గత యూపీఏ ప్రభుత్వం ఇష్టారీతిన కార్పొరేట్లకు ఇప్పించిన పెద్ద రుణాలే కారణమని చెప్పారు. బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన సాయం చేస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నిస్తేజాన్ని పోగొట్టేందుకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా రుణాలను బ్యాంకుల ద్వారా అన్ని వర్గాలకు ఇప్పిస్తున్నామన్నారు.

దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. మాంద్యంలోకి దేశ ఆర్థిక వ్యవస్థ వెళ్లనీయమన్నారు. ఆందోళన అవసరం లేదని, అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, రాజ్యసభలో నిర్మలా సీతారామన్ ప్రసంగించే సమయంలో పలువురు నేతలు కునుకు తీశారు. ఆమె ప్రసంగించే సమయంలో కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండే కునుకు తీస్తూ కనిపించారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా వెనుకాల అదే పరిస్థితిలో కనిపించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+