Nominee Rules Change: బ్యాంకింగ్ చట్టంలో నామినీ రూల్స్ మార్పు..!! తప్పక తెలుసుకోండి..
Banking News: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిలో కీలక మార్పులకు ఆమె శ్రీకారం చుట్టారు. అయితే లోక్సభలో కొందరు విపక్ష సభ్యులు ఈ బిల్లును సభలో వ్యతిరేకించారు.
నిర్మలమ్మ ప్రకటించిన మార్పుల్లో చాలా కీలకమైనది నామినీ వివరాలకు సంబంధించినది. ఈ బిల్లులో ప్రతి బ్యాంకు ఖాతాదారుడు ఒక ఖాతాకు ఏకంగా నలుగురు నామినీలను చేర్చవచ్చనే కొత్త నిబంధన ప్రతిపాదించబడింది. ప్రస్తుతం బ్యాంకులు తమ ఖాతాదారులకు కేవలం ఒక నామినీని ఎంపిక చేసుకునేందుకు మాత్రమే వెసులుబాటు కల్పిస్తున్నాయి. బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందితే ఇకపై నామినీల సంఖ్య నాలుగుకు పెరుగుతుంది.

అలాగే కంపెనీ డైరెక్టర్ల గణనీయమైన వడ్డీని పునర్నిర్వచించబడింది. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత రూ.5 లక్షల పరిమితిని రూ.2 కోట్లకు పెంచారు. ఇదే క్రమంలో సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు సంబంధించిన చట్టాలను సవరించే హక్కు రాష్ట్రాలకు ఉందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఈ విషయంలో శాసన హక్కులకు సంబంధించిన సందిగ్ధత గురించి కూడా మాట్లాడారు. కేంద్రం సహకార సంఘాలను నియంత్రించగలదా లేదా అనే దానిపై వైరుధ్యం ఉందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏకకాలంలో నాలుగు చట్టాలను సవరించాలని ప్రయత్నించటాన్ని ఆర్ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలను నిర్మలమ్మ తోసిపుచ్చారు.
చట్టబద్ధమైన ఆడిటర్లకు చెల్లించాల్సిన వేతనాన్ని నిర్ణయించడంలో బ్యాంకులకు మరింత స్వేచ్ఛను కూడా బిల్లు అందిస్తుంది. 2వ మరియు 4వ శుక్రవారాలకు బదులుగా ప్రతి నెలా 15, చివరి రోజుగా బ్యాంకుల నియంత్రణ సమ్మతి కోసం రిపోర్టింగ్ తేదీలను పునర్నిర్వచించాలని కూడా బిల్లు కోరింది.


Click it and Unblock the Notifications