పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా నీరవ్ మోడీ.. ప్రకటించిన ముంబై కోర్టు

వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్‌ మోడీని ఎట్టకేలకు 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు'గా (ఎఫ్‌ఈవో) ముంబై కోర్టు గురువారం ప్రకటించింది. ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌‌ (పీఎన్‌బీ)కి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు వేల కోట్ల రూపాయల మేర టోకరా వేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో విచారణ జరుపుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభ్యర్థన మేరకు గురువారం ముంబై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది. కోర్టు తాజా ఆదేశాలతో నీరవ్ మోడీకి చెందిన ఆస్తుల జప్తునకు మార్గం కూడా సుగమమైంది.

Nirav Modi declared fugitive economic offender

2018లో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్(ఎఫ్‌ఈవో) చట్టం వచ్చిన తర్వాత.. మరో ఆర్థిక నేరస్తుడు, కింగ్ ఫిషర్ అధినేత అయిన విజయ్‌ మాల్యా తర్వాత.. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి ముద్ర పడినది మళ్లీ నీరవ్‌ మోడీకే. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ స్కామ్ వెలుగులోకి రావడానికి ముందే 2018 జనవరిలో నీరవ్‌ మోడీ అతడి బంధువులు తెలివిగా దేశం విడిచి పారిపోయారు.

ఈ కేసులో 2019 మార్చిలో నీరవ్ మోడీ లండన్‌లో అరెస్టయ్యాడు. అక్కడి కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుని శతవిధాల ప్రయత్నించినా అతడికి బెయిల్ దొరకలేదు. మరోవైపు నీరవ్ మోడీని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. త్వరలోనే అతడ్ని భారత్‌కు తీసుకొచ్చి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. జరుగుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+