Nike Layoffs: సాధారణంగా లేఆఫ్స్ అనే పదం గతంలో IT రంగంలో ఎక్కువగా వినబడుతూ ఉండేది. కరోనా తర్వాత ఆయా కంపెనీల ఆర్థికస్థితి క్షీణించడంతో ఉద్యోగుల సంఖ్యలో కోత విధించాల్సిన అవసరం ఏర్పడింది. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన ఉద్వాసనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
అమెరికా ఒరెగాన్లో ఉన్న తన ప్రధాన కార్యాలయం నుంచి సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైక్ ప్రకటించింది. 740 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ఈ మేరకు కంపెనీ ఓ లేఖను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాబడి క్షీణత తర్వాత ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది.

జూన్ 28 నాటికి రెండవ దశ లేఆఫ్స్ ప్రభావం ప్రారంభం కానున్నట్లు నైక్ పీపుల్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిచెల్ ఆడమ్స్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో 2 బిలియన్ డాలర్ల మేర ఖర్చు తగ్గించడానికి గత డిసెంబర్లోనే పొదుపు చొరవను ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు లేఆఫ్స్కు నిర్ణయం తీసుకుంది.
తన శ్రామికశక్తిలో 2 శాతం అంటే 1,600 మందిని తొలగించాలన్న ఉద్దేశాన్ని ఫిబ్రవరిలో కంపెనీ వెల్లడించింది. కాగా మే 31, 2023 నాటికి నైక్లో దాదాపు 83 వేల 700 మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ షేర్లు దాదాపు 13% పడిపోయినప్పటికీ, ఈ నిర్ణయం తర్వాత ట్రేడింగ్లో స్వల్ప పెరుగుదలను చవిచూశాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications