నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 300 పాయింట్లు డౌన్
ముంబై: మార్కెట్లు శుక్రవారం (మార్చి 3) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 238.64 పాయింట్లు ( 0.84%) నష్టపోయి 28,026.67 వద్ద, నిఫ్టీ 68.55 పాయింట్లు (0.83%) నష్టపోయి 8,185.25 వద్ద ప్రారంభమైంది. 410 షేర్లు లాభాల్లో, 263 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 45 షేర్లలో మార్పులేదు. అంతకుముందు ప్రీట్రేడింగ్లో సెన్సెక్స్ 211 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడింది. ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆ తర్వాత కాసేపటికి సెన్సెక్స్ 300పాయింట్లు నష్టపోయింది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలలకు పైగా మార్కెట్లు భారీ నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ రెండు నెలల కాలంలో సెన్సెక్స్ 42,000 రికార్డ్ స్థాయి నుండి 28,000కు పడిపోయింది. నిఫ్టీ 12,000 రికార్డ్ నుండి 8,000 దిగి వచ్చింది. 30 శాతానికి పైగా పడిపోయాయి.