మార్కెట్: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: బడ్జెట్ రోజు (ఫిబ్రవరి 1, శనివారం) భారీగా నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి లాభాల్లోకి వచ్చాయి. మంగళవారం అయితే భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం కూడా మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 129.66 పాయింట్లు (0.32%) లాభపడి 41272.32 వద్ద, నిఫ్టీ 43.50 పాయింట్లు (0.36%) లాభపడి 12132.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
హెచ్సీఎల్ టెక్, హీరో మోటో కార్ప్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, అల్ట్రా సిమెంట్, మారుతీ, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్, ఎస్బీఐ, ఐటీసీ, హిందూస్తాన్ యూనీలీవర్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీలు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. యాక్సిస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో జీఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, హెచ్సీఎల్ టెక్, ఐవోసీ, సిప్లా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హిండాల్కో, కొటక్ మహీంద్రా, ఎన్టీపీసీ ఉన్నాయి.