భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: 2 రోజుల్లో సెన్సెక్స్ 1600 పాయింట్లు పతనం
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు గురువారం (మార్చి 25) భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న 870 పాయింట్లకు పైగా నష్టాల్లో క్లోజ్ అయిన సెన్సెక్స్ నేడు మరో 740 పాయింట్లు పతనమైంది. ఈ రెండు రోజుల్లోనే 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం, మహమ్మారి వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్డౌన్లు విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో మార్కెట్లు వరుసగా రెండోరోజూ భారీ నష్టాలను నమోదు చేశాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 722.62 వద్ద ట్రేడ్ అయింది.
మార్చి 31 గడువు: పాన్-ఆధార్ కార్డ్ లింక్ కోసం మరో వారం రోజులే గడువు
సెన్సెక్స్ భారీ నష్టాల్లో
నేడు సెన్సెక్స్ 49,201.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,247.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,236.35 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ రెండు రోజుల్లో దాదాపు 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు సెన్సెక్స్ 740.19 (1.51%) పాయింట్లు దిగజారి 48,440 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,570.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,575.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,264.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 224.50 (1.54%) పాయింట్లు నష్టపోయి 14,324.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, SBI, రిలయన్స్, HDFC బ్యాంకు ఉన్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 2.90 శాతం, ICICI బ్యాంకు 0.71 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.69 శాతం, HDFC బ్యాంకు 0.20 శాతం, JSW స్టీల్ 0.15 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 3.95 శాతం, IOC 3.86 శాతం, HUL 3.52 శాతం, కోల్ ఇండియా 3.17 శాతం, హీరో మోటో కార్ప్ 3.04 శాతం నష్టపోయాయి.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.54 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 2.15 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 2.76 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.86 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.91 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.28 శాతం, నిఫ్టీ ఐటీ 2.19 శాతం, నిఫ్టీ మీడియా 3.06 శాతం, నిఫ్టీ ఫార్మా 0.83 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.58 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.50 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.78 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.75 శాతం లాభపడింది.