స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. నేడు ఏ దశలోను పూర్తిగా లాభాల్లోకి రాలేదు. మధ్యలో కాసేపు ఒకటిరెండుసార్లు లాభాల్లోకి వచ్చినప్పటికీ వెంటనే నష్టపోయింది. రేపు ఆప్షన్స్ ట్రేడింగ్ ముగియనున్న నేపథ్యంలో చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియా సూచీలు ప్రతికూలంగా ముగియడం సూచీలపై ప్రభావం చూపింది. అమెరికా-చైనా అధ్యక్షుల మధ్య జరిగిన చర్చలు ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. పైగా దేశీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో సూచీలకు ఏ దశలోనూ మద్దతు లభించలేదు.
ఉదయం 60,179.93 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 60,426.61 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,944.77 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,939.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,022.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,879.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 314.04 (0.52%) పాయింట్లు నష్టపోయి 60,008.33 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100.55 (0.56%) పాయింట్లు నష్టపోయి 17,898.65 పాయింట్ల వద్ద ముగిసింది.

రిలయన్స్, HDFC జంట షేర్లు, ఐసీఐసీఐ బ్యాంక్ సహా పలు దిగ్గజ షేర్లు నష్టపోవడం సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా సూచీలు ఒక శాతం చొప్పున నష్టపోయాయి. మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.2 శాతం నష్టపోగా, స్మాల్ క్యూప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications