భారీ లాభాల నుండి భారీ నష్టాల్లోకి మార్కెట్లు, అన్ని రంగాలూ అంతే
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 9) లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు లాభాల్లో ఉన్నప్పటికీ, ఒకటి గంటల సమయానికి నష్టాల్లోకి వెళ్ళింది. చివరి అరగంటలో కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ భారీ నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ నేడు 700 పాయింట్లు పైకి, కిందకు కదిలింది. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా, నిఫ్టీ వంద పాయింట్లకు పైగా నష్టపోయింది. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.
స్వల్ప లాభాల్లో సెన్సెక్స్
సెన్సెక్స్ నేడు 52,401.41 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,446.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,717.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 333.93 (0.64% పాయింట్లు నష్టపోయి 51,941.64 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,766.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,800.45 గరిష్టాన్ని, 15,566.90 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం సమయానికి 104.75 (0.67%) పాయింట్లు నష్టపోయి 15,635.35 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.44 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 1.91 శాతం, ఎన్టీపీసీ 1.64 శాతం, టైటాన్ కంపెనీ 1.07 శాతం,
దివిస్ ల్యాబ్స్ 0.62 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.66 శాతం, అదానీ పోర్ట్స్ 2.47 శాతం, లార్సన్ 1.93 శాతం, శ్రీ సిమెంట్స్ 1.89 శాతం, రిలయన్స్ 1.79 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, రిలయన్స్ ఉన్నాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.67 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.69 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.28 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.81 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.37 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.66 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.23 శాతం, నిఫ్టీ ఐటీ 0.31 శాతం, నిఫ్టీ మీడియా 2.10 శాతం, నిఫ్టీ మెటల్ 0.94 శాతం, నిఫ్టీ ఫార్మా 0.50 శాతం, నిఫ్టీ PSU బ్యాంకు 1.43 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.66 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.87 శాతం నష్టపోయాయి.