భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 471 పాయింట్లు డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (మే 12) భారీ నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 471 పాయింట్ల నష్టంతో ముగిసింది. కమోడిటీ ధరలు ఎగిసిపడటంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి అమెరికా మార్కెట్లు నిన్న నష్టాల్లో ముగిశాయి. అక్కడి నుండి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ద్రవ్యోల్బణ భయం, కమొడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు, బాండ్ల రాబడులు పెరగొచ్చన్న అంచనాలతో నేడు అప్రమత్తంగా కదలాడాయి. వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు, కొవిడ్ భయాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయి.
భారీ నష్టాల్లో మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 49,171.28 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,171.28 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,550.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 471.01 (0.96%) పాయింట్లు నష్టపోయి 48,690.80 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 154.25 (1.04%) పాయింట్లు క్షీణించి 14,696.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,823.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,824.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,649.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 3.31 శాతం, టైటాన్ కంపెనీ 1.37 శాతం, మారుతీ సుజుకీ 1.20 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.14 శాతం, యూపీఎల్ 1.07 శాతం లాభపడ్డాయి.
నేటి టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 4.44 శాతం, JSW స్టీల్ 3.59 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.39 శాతం, హిండాల్కో 3.39 శాతం, HUL 3.05 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, జేఎస్డబ్ల్యు స్టీల్ ఉన్నాయి.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.04 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.11 నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకు 1.28 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.06 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.23 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.21 శాతం, నిఫ్టీ ఐటీ 0.96 శాతం, నిఫ్టీ మెటల్ 2.97 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.19 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.64 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మీడియా 0.65 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 3.24 శాతం, లాభపడ్డాయి.