స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం దారుణంగా పతనమైన సూచీలు, ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. కానీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నానికి నేటి కనిష్టాల నుండి మాత్రం కోలుకున్నాయి. అయితే అమ్మకాలు కొనసాగడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణం, ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడం, మందగమన సూచనలు సూచీలపై ప్రభావం చూపాయి.
సెన్సెక్స్ ఉదయం 54,188 పాయింట్లు క్షీణించి 54,795 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,918 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 365 పాయింట్లు లేదా 0.67 శాతం క్షీణించి 54,470 పాయింట్ల వద్ద, 109 పాయింట్లు లేదా 0.67 శాతం నష్టపోయి 16,301 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి 77.46 వద్ద ముగిసింది.

బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు రెండు శాతం చొప్పున క్షీణించాయి. పవర్, మెటల్, పీఎస్యూ బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్ప్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, దివిస్ ల్యాబ్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్, నెస్ట్లే, ఇండస్ ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, టాటా స్టీల్ ఉన్నాయి. కాగా, గత రెండు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.7.7 లక్షల కోట్లు క్షీణించింది. మార్కెట్లు రెండు నెలల కనిష్టానికి పడిపోయింది.
More From GoodReturns

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో అన్ని రంగాలు విలవిల..ఎంతలా అంటే..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications