భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 975 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (శుక్రవారం, మే 21) అదరగొట్టాయి. కీలక రంగాల షేర్లు అన్నీ దూసుకెళ్లాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ఆశలు మొలకెత్తాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలాగే పలు కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా నమోదయ్యాయి. ఇది కూడా సూచీలకు కలిసి వచ్చింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడం కూడా సానుకూలతకు కారణం. సెన్సెక్స్ ఏకంగా దాదాపు వెయ్యి పాయింట్లు లాభపడి 50,500ను క్రాస్ చేసింది. నిఫ్టీ 15,175 పాయింట్లకు చేరుకుంది.
సూచీలు అదరగొట్టాయి
సెన్సెక్స్ 49,833.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,591.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,832.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 975.62 (1.97%) పాయింట్లు ఎగిసి 50,540.48 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,987.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,190.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,985.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు నిఫ్టీ 269.25 (1.81%) పాయింట్లు ఎగిసి 15,175.30 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC బ్యాంకు 4.50 శాతం, SBI 4.33 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 4.15 శాతం, ICICI బ్యాంకు 3.86 శాతం, యాక్సిస్ బ్యాంకు 3.54 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.44 శాతం, ఐవోసీ 0.38 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.38 శాతం, ఐచర్ మోటార్స్ 0.33 శాతం, గ్రాసీమ్ 0.25 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో ఎస్బీఐ, టాటా స్టీల్, ICICI బ్యాంకు, HDFC బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 1.81 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.95 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.84 శాతం, నిఫ్టీ బ్యాంకు 3.82 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.89 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.21 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.62 శాతం, నిఫ్టీ ఐటీ 0.81 శాతం, నిఫ్టీ మీడియా 0.99 శాతం, నిఫ్టీ మెటల్ 0.43 శాతం, నిఫ్టీ ఫార్మా 0.17 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 3.80 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.15 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.62 శాతం లాభపడ్డాయి.