వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా భారీ లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ రోజున తీవ్ర నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. సోమవారం కాస్త కోలుకున్నాయి. మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బుధవారం కూడా అదే పరంపర కొనసాగించాయి. ఈ రోజు సెన్సెక్స్ 353.28 (0.87%) పాయింట్లు ఎగిసి 41,142.66 వద్ద, నిఫ్టీ 109.50 (0.91%) పాయింట్లు లాభపడి 12,089.15 వద్ద క్లోజైంది. బడ్జెట్ రోజు మినహా ఆ తర్వాత సెన్సెక్స్ వరుసగా మూడు సెషన్లలో లాభాల్లో ముగిసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం రూ.71.22 వద్ద ట్రేడైంది.
హాస్పిటల్ ఖర్చులకు అపోలో-బజాజ్ ఆఫర్: EMI హెల్త్ కార్డ్
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, యస్ బ్యాంకు, టాటా స్టీల్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటాకార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్ప్, మారుతీ సుజుకీ ఉన్నాయి.
టాటా స్టీల్స్, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ, టైటాన్, ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, సన్ ఫార్మా లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్, నెస్ట్లే, మారుతీ, హీరో మోటో కార్ప్ నష్టాల్లో ముగిశాయి.