ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 22) స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 3.38 పాయింట్లు లేదా 0.01% నష్టపోయి 30,633.33 వద్ద, నిఫ్టీ 11.80 పాయింట్లు లేదా 0.13% నష్టపోయి 8,969.65 వద్ద ప్రారంభమయ్యాయి. 376 షేర్లు లాభాల్లో, 419 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, జీఎంటర్టైన్మెంట్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, హీరో మోటో కాప్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, వేదాంత, ఐవోసీ, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి.స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 22) స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి సెన్సెక్స్ 3.38 పాయింట్లు లేదా 0.01% నష్టపోయి 30,633.33 వద్ద, నిఫ్టీ 11.80 పాయింట్లు లేదా 0.13% నష్టపోయి 8,969.65 వద్ద ప్రారంభమయ్యాయి. 376 షేర్లు లాభాల్లో, 419 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, జీఎంటర్టైన్మెంట్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, హీరో మోటో కాప్ప్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, వేదాంత, ఐవోసీ, హిండాల్కో, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి.
రూపాయి ఈ రోజు మరింత బలహీనపడింది. యూఎస్ డాలర్ మారకంతో ఏకంగా 76.92కు చేరుకొని, రూ.77 సమీపానికి చేరుకుంది. నిన్న రూపాయి రూ.76.83 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 76.90 వద్ద ప్రారంభమై ఆ తర్వాత రూ.76.85 నుండి రూ.76.92 మధ్య ట్రేడ్ అయింది.

మార్కెట్లు నిన్న చమురు సెగ వల్ల నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ప్రారంభం నుంచే నష్టాల బాటపట్టిన సూచీలకు గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు పతనానికి మరింత ఆజ్యంపోశాయి. ఆర్థిక, మెటల్, ఇంధనం, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ మూడు శాతానికి పైగా కోల్పోయింది. చివరకు 1,011.29 పాయింట్లు కోల్పోయి 30,636.71 వద్ద ముగిసింది.
నిన్న సెన్సెక్స్ భారీ నష్టాల కారణంగా రూ.3.30 లక్షల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అయింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.3,30,409 కోట్లు తగ్గి రూ.120.42 లక్షలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మరింత బలపడటం, మరోవైపు ఈక్విటీలు కుదేలవడంతో ఇండియన్ కరెన్సీ కూడా నిన్న ఒత్తిడికి గురైంది. ఫారెక్స్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి డాలర్ మారకంతో రూపాయి 30 పైసలు కోల్పోయి 76.83 వద్దకు చేరుకుంది.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications