స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 8 వేలు దాటడం, ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 2 లక్షలకు చేరుకోడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మార్కెట్లు నష్టపోతున్నాయి. అన్ని రంగాల షేర్లు పడిపోతున్నాయి.
ఉదయం గం.9:17 సమయానికి సెన్సెక్స్ 1,755.52 పాయింట్లు (6.08%) నష్టంతో 27,113.99 వద్ద, నిఫ్టీ 521.25 పాయింట్ల (6.15%) నష్టంతో 7,947.55 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 117 షేర్లు లాభాల్లో, 714 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 29 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి విలువ 69 పైసలు క్షీణించి 74.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్లో రూ.74.26 వద్ద క్లోజ్ అయింది.

నిన్నటి వరకు భారీ లాభాల్లో ఉన్న యస్ బ్యాంకు షేర్ గురువారం మాత్రం నష్టపోయింది. ఉదయం గం.10.19 సమయానికి ఈ షేర్ గత సెషన్ ముగింపుతో పోలిస్తే రూ.13.80 (22.83 శాతం) పడిపోయి రూ.46.65 వద్ద ట్రేడ్ అయింది. ఒకటి రెండు షేర్లు మినహా దాదాపు అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉంది. టాప్ లూజర్స్ జాబితాలో ఈ రోజు యస్ బ్యాంకు టాప్లో నిలిచింది. ఆ తర్వాత భారతీ ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, జీ ఎంటర్మటైన్మెంట్, కోల్ ఇండియా ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications