మార్కెట్లు పతనం: నిఫ్టీ బిలో 8,000, సెన్సెక్స్ 1,700 పాయింట్లు డౌన్, యస్ బ్యాంక్ 20% పతనం

స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 8 వేలు దాటడం, ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 2 లక్షలకు చేరుకోడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మార్కెట్లు నష్టపోతున్నాయి. అన్ని రంగాల షేర్లు పడిపోతున్నాయి.

ఉదయం గం.9:17 సమయానికి సెన్సెక్స్ 1,755.52 పాయింట్లు (6.08%) నష్టంతో 27,113.99 వద్ద, నిఫ్టీ 521.25 పాయింట్ల (6.15%) నష్టంతో 7,947.55 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 117 షేర్లు లాభాల్లో, 714 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 29 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్ మారకంతో రూపాయి విలువ 69 పైసలు క్షీణించి 74.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్‌లో రూ.74.26 వద్ద క్లోజ్ అయింది.

 Nifty below 8,000, Sensex tanks 1,700 points, Yes bank at 48

నిన్నటి వరకు భారీ లాభాల్లో ఉన్న యస్ బ్యాంకు షేర్ గురువారం మాత్రం నష్టపోయింది. ఉదయం గం.10.19 సమయానికి ఈ షేర్ గత సెషన్ ముగింపుతో పోలిస్తే రూ.13.80 (22.83 శాతం) పడిపోయి రూ.46.65 వద్ద ట్రేడ్ అయింది. ఒకటి రెండు షేర్లు మినహా దాదాపు అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉంది. టాప్ లూజర్స్ జాబితాలో ఈ రోజు యస్ బ్యాంకు టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత భారతీ ఇన్ఫ్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, జీ ఎంటర్మటైన్మెంట్, కోల్ ఇండియా ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+