ఇన్వెస్టర్లకు ఊరట: భారీ లాభాల్లోకి మార్కెట్లు, సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మూడోరోజు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మంగళ, బుధవారాలు భారీ లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. గురువారం కూడా అదే ఒరవడి కొనసాగింది. ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 754 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్లు ఎగిసింది. డాలరు మారకంతో రూపాయి 75.87 వద్ద ప్రారంభించింది. మంగళవారం రూ.75.88 వద్ద క్లోజ్ అయింది.
గం.9.19 సమయానికి సెన్సెక్స్ 243.93 పాయింట్ల (0.85%) లాభంతో 28,779.71, నిఫ్టీ 53.85 పాయింట్ల (0.65%) లాభంతో 8,371.70 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. సెన్సెక్స్ ఉదయం గం.10 సమయానికి 1,029.59 (3.61%) పాయింట్లు ఎగిసి 29,565.37 వద్ద ట్రేడ్ అయింది.
ఇండస్ ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ భారీ లాభాల్లో ఉండగా, యస్ బ్యాంకు, గ్రాసిమ్, జెఎస్డబ్ల్యు, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీలో నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, మెటల్, ఇన్ఫ్రా రంగాలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, ఫార్మా స్టాక్స్ విక్రయిస్తున్నారు.
రూ.30,000 కంటే తక్కువ శాలరీ ఉంటే: ఉద్యోగులకు రిలయన్స్ ఊరట
మార్కెట్లు లాభాల్లోకి రావడానికి పలు కారణాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలను చూస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు మన మార్కెట్లపై ప్రభావం చూపింది.