For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. కారణాలివే, నష్టపోయిన రూపాయి

|

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. మ్యూచువల్ ఫండ్స్‌కు ఆర్బీఐ రూ.50,000 కోట్ల ఉద్దీపనలు ప్రకటించడంతో నిన్న భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు కూడా అదే ఒరవడి కొనసాగించాయి. తొలుత కాసేపు నష్టాల్లోకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత మెల్లిగా లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 294.09 పాయింట్లు లేదా 0.93% లాభపడి 32,037.17 వద్ద, నిఫ్టీ 86.30 పాయింట్లు లేదా 0.93% లాభపడి 9,368.60 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రారంభంలో 585 షేర్లు లాభాల్లో, 137 షేర్లు నష్టాల్లో ఉండగా, 39 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

<strong>ఐటీ కంపెనీలకు భారీ షాక్, క్లయింట్స్‌తో సంప్రదింపులకు ఇబ్బందికరమే</strong>ఐటీ కంపెనీలకు భారీ షాక్, క్లయింట్స్‌తో సంప్రదింపులకు ఇబ్బందికరమే

అమెరికా డాలర్ మారకంతో రూపాయి 76.31 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. సోమవారం రోజు 76.24 వద్ద క్లోజ్ అయింది. 7 పైసలు నష్టపోయింది. ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి.

 Nifty above 9,300, Sensex up 100 points

అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో క్రమంగా ఆంక్షలు ఎత్తివేయడం, ఆర్థిక పునరుద్ధరణకు అగ్రరాజ్యం చర్యలు, మన దేశంలో కేసుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆర్బీఐ, కేంద్రం చర్యలు వంటివి మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. చమురు ధరలు ఒడిదుడుకులకు లోనయ్యాయి.

English summary

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. కారణాలివే, నష్టపోయిన రూపాయి | Nifty above 9,300, Sensex up 100 points

Indian indices erased some of early gains but trading higher with Nifty around 9300 level. Pharma, auto and FMCG stocks under pressure.
Story first published: Tuesday, April 28, 2020, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X