దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న దాదాపు 300 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ నేడు దాదాపు మరో 500 పాయింట్ల వరకు ఎగిసింది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ, అది కూడా దాదాపు 200 పాయింట్ల లాభాల్లోనే కనిపించింది. ప్రధానంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ రంగాల షేర్లు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒకటి రెండు తప్ప మిగిలినవి అన్నీ లాభాల్లోనే ట్రేడ్ ముగిశాయి. బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.

రెండ్రోజుల్లో 750 పాయింట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 57,751.21 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,952.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,650.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 477 పాయింట్లు ఎగిసి 57,897 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,177.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,250.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,161.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 147.00 (0.86%) పాయింట్లు ఎగిసి 17,233 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న 750 పాయింట్ల వరకు లాభపడింది. సూచీలు వారం గరిష్టానికి చేరాయి.

టాప్ లూజర్స్, గెయినర్స్
సుప్రియా లైఫ్ సైన్సెస్ షేరు నేడు లిస్టయింది. ఆఫర్ ధర రూ.274 కాగా, 53.7 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ను ప్రారంభించింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్ కంపెనీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రూపాయి జంప్
డాలర్ మారకంతో రూపాయి నేడు మరింత లాభపడింది. నేటి సెషన్లో 34 పైసలు ఎగిసి 74.66 వద్ద క్లోజ్ అయింది. ఇండియన్ ఈక్విటీ సూచీల పాజిటివ్ కదలిక, బలమైన ఆసియా కరెన్సీ మద్దతు లభించింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్పై RBI కఠిన ఆంక్షలు..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications