రూ. 16 వేల కోట్లతో రాయ్‌పూర్–విశాఖపట్నం కారిడార్.. పూర్తిగా మారిపోనున్న వైజాగ్ రూపురేఖలు..

భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాయ్‌పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్ దేశ మౌలిక సదుపాయాల రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 464 కిలోమీటర్ల పొడవుతో రూపొందుతున్న ఈ కారిడార్‌లో 125 కిలోమీటర్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గుండా వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది ఛత్తీస్‌గఢ్‌లో నిర్మించబడుతున్న మొట్టమొదటి 6-లేన్ల యాక్సెస్-నియంత్రిత ఆర్థిక కారిడార్ కావడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

NHAI అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ కారిడార్ కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడికి కూడా దోహదపడనుంది. దాదాపు రూ.16,491 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించి ఏడు గంటలలోపే చేరుకునేలా రూపకల్పన చేశారు. దీని ద్వారా వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు కొత్త ఊపిరి లభించనుంది.

NHAI Raipur Visakhapatnam corridor Raipur Vizag economic corridor NHAI highway project news Raipur to Visakhapatnam corridor update NHAI infrastructure development economic corridor India highway project to boost economy NHAI green highway project wildlife protection highway India eco friendly corridor NHAI Raipur Vizag road project logistics corridor India NHAI latest news today NHAI NHAI NHAI
Photo Credit:

ఈ ఆర్థిక కారిడార్ వల్ల ఛత్తీస్‌గఢ్, ఒడిశా పారిశ్రామిక కేంద్రాలు.. విశాఖపట్నం పోర్టు మధ్య కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. అంతేకాదు, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి నెట్‌వర్క్‌కు కూడా ఇది అనుసంధానమై లాజిస్టిక్స్ రంగానికి మేలు చేయనుంది. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాలు అయిన ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని అనేక జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే రాయ్‌పూర్ జిల్లాలోని ఝంకి గ్రామం నుంచి ప్రారంభమై.. కురుద్, నగరి, నహర్‌పూర్, బదేరాజ్‌పూర్ గుండా సాగి ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. పూర్తిగా యాక్సెస్-నియంత్రితంగా రూపొందించిన ఈ కారిడార్‌పై గరిష్టంగా 100 కి.మీ. వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్ చేశారు.ఈ ప్రాజెక్టు ద్వారా ధమ్తరి, కాంకేర్, బస్తర్ వంటి గిరిజన జిల్లాలు, అలాగే బస్తర్, కాంకేర్, కొండగావ్ వంటి అభివృద్ధికి దూరంగా ఉన్న జిల్లాలకు వేగవంతమైన కనెక్టివిటీ లభించనుంది. దీని వల్ల నగరాల మధ్య దూరాలు తగ్గి, సరుకు రవాణా మరింత సులభమవుతుంది. ఫలితంగా ఇంధన వినియోగం తగ్గి, కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది.

వన్యప్రాణుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.. NHAI ఈ కారిడార్‌లో బహుళ జంతు ఓవర్‌పాస్‌లు, అండర్‌పాస్‌లు, కోతుల పందిర్లు ఏర్పాటు చేస్తోంది. రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ట్రాఫిక్ ఇంపాక్ట్ అటెన్యుయేటర్లు కూడా అమర్చారు. ఇవి ఢీకొన్నప్పుడు ప్రమాద ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

ఈ ప్రాజెక్టులో మరో విశేష ఆకర్షణ ఉదాంటి సీతానది టైగర్ రిజర్వ్ (USTR). ఎకో-సెన్సిటివ్ జోన్ గుండా నిర్మించబడుతున్న 2.79 కి.మీ. పొడవైన 6-లేన్ల ట్విన్-ట్యూబ్ సొరంగం. ఇది ఛత్తీస్‌గఢ్‌లో తొలి రోడ్డు సొరంగం కావడం గర్వకారణం. ఈ సొరంగం పర్యావరణానికి తక్కువ హాని కలిగేలా రూపొందించబడింది.

ఈ సొరంగం వల్ల కాంకేర్, కేష్కల్ కొండ ప్రాంతాల్లో రవాణా మరింత వేగవంతమవుతుంది. అంతేకాదు, పొడవైన మార్గాలను తప్పించి ఇనుప గనుల రవాణాకు ఇది వరంగా మారనుంది. క్లుప్తంగా చెప్పాలంటే రాయ్‌పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్ దేశ ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు, ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి ఒక కీలక మలుపుగా నిలవనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+