Highways News: రోడ్డెక్కితే తాట తీస్తున్న కేంద్రం.. మరోసారి వడ్డనకు ఆదేశాలు

Toll fee hike: గత పదేళ్ల కాలంలో దేశంలో చాలా మార్పులు వచ్చాయి. మౌలిక సదుపాయాల కల్పనకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. రోడ్ల నిర్మాణంలో చురుకుగా వ్యవహరించింది. ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంది. అయితే వడ్డింపుల విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా మరోసారి సామాన్యుడి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా రహదారులపై టోల్‌ గేట్ రుసుమను పెంచుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సగటున 5 శాతం పెంచినట్లు తెలుస్తోంది. ఈ పెరిగిన ధరలు జూన్ 3వ తేదీ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. నిజానికి ఈ పెంపు ఏప్రిల్ నుంచే మొదలు కావాల్సి ఉంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తేదీని కొంతమేర పొడిగించారు. ఇప్పుడు అవి కాస్తా ముగియడంతో పాత నిర్ణయాన్ని అమలు చేయనుంది.

NHAI announced Tool Gate fee increase from June 3 midnight

ఇలా ఎన్నికలు ముగిస్తాయో లేదో వెంటనే బాదుడు మొదలెట్టేశారని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. పన్నులు వసూలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని పలువురు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వసూలు చేస్తున్న మేరకు రోడ్ల అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా మోదీ సర్కారు ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది.

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చేసిన ప్రకటన కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల సమూల నిర్మూలన సాధ్యం కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అంతలోనే మరో కొత్త బాదుడుతో విమర్శకుల నోటికి పని కల్పించినట్లయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+