Toll fee hike: గత పదేళ్ల కాలంలో దేశంలో చాలా మార్పులు వచ్చాయి. మౌలిక సదుపాయాల కల్పనకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. రోడ్ల నిర్మాణంలో చురుకుగా వ్యవహరించింది. ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు చర్యలు తీసుకుంది. అయితే వడ్డింపుల విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా మరోసారి సామాన్యుడి నడ్డి విరిచేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా రహదారులపై టోల్ గేట్ రుసుమను పెంచుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సగటున 5 శాతం పెంచినట్లు తెలుస్తోంది. ఈ పెరిగిన ధరలు జూన్ 3వ తేదీ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. నిజానికి ఈ పెంపు ఏప్రిల్ నుంచే మొదలు కావాల్సి ఉంది. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తేదీని కొంతమేర పొడిగించారు. ఇప్పుడు అవి కాస్తా ముగియడంతో పాత నిర్ణయాన్ని అమలు చేయనుంది.

ఇలా ఎన్నికలు ముగిస్తాయో లేదో వెంటనే బాదుడు మొదలెట్టేశారని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. పన్నులు వసూలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని పలువురు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వసూలు చేస్తున్న మేరకు రోడ్ల అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా మోదీ సర్కారు ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చేసిన ప్రకటన కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల సమూల నిర్మూలన సాధ్యం కాదనే విషయాన్ని ఆయన గుర్తించాలంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. అంతలోనే మరో కొత్త బాదుడుతో విమర్శకుల నోటికి పని కల్పించినట్లయింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications