బెంగళూరు: విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీకి పదవీ గండం పొంచి ఉందట! మార్కెట్ రెగ్యులేటర్ SEBI కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో రిషద్ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఎగ్జిక్యూటివ్ రోల్ను కోల్పోయే ప్రమాదం ఉంది. అజీమ్ ప్రేమ్జీ గత ఏడాది తప్పుకోవడంతో ఆయన తనయుడు ఈ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పదవిని కోల్పోయే అవకాశముంది.

సెబి నిబంధన ప్రకారం...
SEBI నిబంధనల ప్రకారం టాప్ 500 లిస్టెడ్ కంపెనీల చైర్మన్, సీఈవోలు వేర్వేరు వ్యక్తులు ఉండాలనే నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. విప్రో మాత్రం రిషద్నే కొనసాగించాలని సెబిని కోరింది. సెబి కొత్త నియమాల ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్నే బోర్డు చైర్పర్సన్గా నియమించాలి.

విప్రోకు సమాచారం
రిషద్ను కొనసాగించేందుకు అవకాశమివ్వాలని సెబిని విప్రో కోరినప్పటికీ మార్కెట్ నియంత్రణ సంస్థ నిరాకరించింది. రిషద్ చైర్మన్గా ఉండటంతో పాటు ఎగ్జిక్యూటివ్ రోల్ పాత్ర పోషిస్తే అది సెబి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని విప్రోకు సమాచారం కూడా అందించిందని తెలుస్తోంది.

ఈ ఆప్షన్ ఉంది..
అయితే మరోవైపు ప్రాక్సీ అడ్వైజరీ సర్వీసస్ ఎండీ శ్రీరాం సుబ్రహ్మణియన్ ఈ అంశంపై స్పందించారు. రిషద్కు రెండు మార్గాలు ఉన్నాయని, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని వదులుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, జాయింట్ MD పదవులను స్వీకరించే అవకాశముందన్నారు.

వాటా ఉన్నా నిర్ణయాలు తీసుకోలేరు..
సెబీ కొత్త నిమయాల మేరకు ప్రమోటర్లకు కంపెనీలో 74% షేర్లు ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోలేరు. విప్రో షేర్స్ను అజీమ్... ప్రేమ్జీ పౌండేషన్కు ఇచ్చినప్పటికి ఓటింగ్ హక్కులు కలిగి ఉంటారని కంపెనీలు వర్గాలు అంటున్నాయి. SEBI నిర్ణయంతో దాదాపు 214 కంపెనీలలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందులో బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, లార్జ్ కార్పోరేట్స్ కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ వంటివి కూడా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications