వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం నుండి కొన్ని బ్యాంకులు ఏటీఎం ఛార్జీలను పెంచబోతున్నాయి. ఏటీఎం ట్రాన్సాక్షన్లు, డెబిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి హెచ్డిఎఫ్సి (HDFC Bank), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బంధన్ బ్యాంకులు కొత్త నిబంధనలు (New rules) ప్రకటించాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్డిఎఫ్సి, బంధన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఏటీఎం రూల్స్ ను అమల్లోకి తీసుకురానున్నాయి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏయే బ్యాంకులు ఎయే మార్పులు చేశాయంటే..

HDFC బ్యాంక్: UPI విత్ డ్రాల్స్పై పరిమితులు
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిస్తూ, కార్డ్లెస్ (Cardless) లేదా యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలను కూడా ఉచిత లావాదేవీల కోటాలోకి చేర్చింది.
- పరిమితి: సొంత బ్యాంక్ ఏటీఎంలలో 5 సార్లు, ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3 సార్లు, నాన్-మెట్రోల్లో 5 సార్లు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు.
- ఛార్జీలు: ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కు రూ. 23 (ప్లస్ టాక్సులు) చెల్లించాలి.
- సమయ నిబంధన: రాత్రి 7:30 గంటల తర్వాత చేసే లావాదేవీలను తర్వాతి రోజు కోటాలో లెక్కిస్తారు. అలాగే నెల చివరి రోజు రాత్రి 7:30 తర్వాత చేసే విత్ డ్రాయల్స్ తర్వాతి నెల కోటాలోకి వెళ్తాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): నగదు పరిమితి సగానికి తగ్గింపు
పీఎన్బీ తన డెబిట్ కార్డ్ వినియోగదారులకు రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని భారీగా తగ్గించింది. రూపే ప్లాటినం, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం వంటి కార్డుల ద్వారా గతంలో రోజుకు రూ. 1 లక్ష వరకు తీసుకునే వెసులుబాటు ఉండగా, ఇకపై దానిని రూ. 50,000 కు తగ్గించారు. రూపే ఉమెన్ పవర్, పీఎన్బీ పలాష్ వంటి కార్డ్ వేరియంట్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
బంధన్ బ్యాంక్: ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్లపై జరిమానా
బంధన్ బ్యాంక్ మరింత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేక ఏటీఎం లావాదేవీ విఫలమైతే (Failed transaction due to insufficient funds), బ్యాంకు రూ. 25 జరిమానా విధిస్తుంది.
- ఛార్జీలు: ఉచిత పరిమితి దాటిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ. 23, నాన్-ఫైనాన్షియల్ (బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటివి) వాటికి రూ. 10 వసూలు చేస్తారు.
డిజిటల్ లావాదేవీలే శరణ్యం
బ్యాంకులు తీసుకువస్తున్న ఈ కొత్త నిబంధనలు (New rules) ప్రధానంగా నగదు నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్దేశించినవి. ATM ల వద్ద రద్దీని తగ్గించి, వినియోగదారులు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మార్గాల వైపు మళ్లేలా ఈ ఛార్జీలు , పరిమితులు విధిస్తున్నారు. కాబట్టి ఖాతాదారులు ఏప్రిల్ 1 నుండి తమ ఏటీఎం విత్ డ్రాయల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, వీలైనంత వరకు ఆన్లైన్ చెల్లింపులు చేయడం ఆర్థికంగా లాభదాయకం.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications