Tata News: టాటా ఎదుట పెద్ద సమస్య.. విస్తారా క్రైసిస్ కొనసాగుతున్న వేళ..
Air India: విమానయాన రంగంలో టాటాలు కొత్త చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తున్న వేళ సమస్యలు అడ్డుపడుతున్నాయి. టాటాల యాజమాన్యంలోని విస్తారా పైలట్లు సెలవులో వెళ్లటం విమానాల రద్దు దారితీసిన వేళ.. ఎయిర్ ఇండియాకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.
తాజా పరిణామాలతో.. టాటా ఎయిర్ ఇండియా కష్టాలు మరింత పెరగనున్నాయి. ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్లు సమ్మెను ప్రకటించారు. జీతాల పెంపు, పదోన్నతులు, యూనిఫాం తదితర అనేక డిమాండ్ల కోసం ఏప్రిల్ 23న సమ్మె చేయనున్నట్టు ప్రభుత్వ సంస్థ ఏఐ ఇంజినీరింగ్ టెక్నీషియన్లు ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆల్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ యూనియన్ CEO, CHROలకు లేఖ రాసింది.

ఏఐ ఇంజనీరింగ్ అతిపెద్ద కస్టమర్ ఎయిర్ ఇండియా. యూనియన్ లేఖ ప్రకారం గత ఏడేళ్లుగా ఉద్యోగులకు పదోన్నతులు జరగలేదు. కనీసం రెండేళ్లపాటు పనిచేసిన టెక్నీషియన్లకు సవరించిన జీతాల అమలు జరగలేదని వెల్లడైంది. కంపెనీ ఉద్యోగుల్లో 75% ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు వివక్షకు గురవుతున్నారని.. వారికి పర్మినెంట్ ఉద్యోగులతో సమానమైన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. సమస్యను పరిష్కరించడానికి యాజమాన్యం యూనియన్తో చర్చలు ప్రారంభించిందని ఏఐ ఇంజనీరింగ్ ప్రతినిధి తెలిపారు.
కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున ఏఐ ఇంజినీరింగ్ టెక్నీషియన్లు మినహా మిగతా ఉద్యోగుల వేతనాలను సవరించింది. యూనియన్ కోర్టు కేసును ఉపసంహరించుకోవడంతో టెక్నీషియన్ల వేతనాలను సవరించాలని కంపెనీ యోచిస్తోంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. విమానయాన కార్మికులలో అసంతృప్తి కారణంగా భారతదేశ విమాన ప్రయాణంలో ఈ బూమ్ ప్రభావితం కావచ్చు. ఇండిగో, ఎయిర్ ఇండియా, అకాశా సంయుక్తంగా 1,100 కంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్లు చేసిన సంగతి తెలిసిందే. దేశ విమానయాన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాల విస్తరణకు తోడ్పాటు అందించడానికి పైలట్లు, ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్లు చాలా ముఖ్యమైనవి. ఈ సమ్మె భారత విమానయాన పరిశ్రమకు మరింత ఇబ్బందిని కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications