ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో సరికొత్త డేటా ప్లాన్ ఆఫర్లు ప్రకటించింది. ఈ సరికొత్త ప్లాన్స్ రూ.22 నుండి ప్రారంభమై, రూ.152 వరకు ఉంటాయి. ఈ ప్లాన్స్ అన్నీ కూడా 28 రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది. కొన్ని ప్లాన్స్ డెయిలీ హైస్పీడ్ క్యాప్ కలిగి ఉంటాయి. కొన్ని ఆఫర్లు డేటా బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. ఇవి ప్రధానంగా జియో ఫోన్ వినియోగదారులకు ఉపయోగపడేలా ఉంటాయి.

5 డేటా ప్యాక్స్ ఇవే
ఈ డేటా ప్లాన్లు రూ.22, రూ.52, రూ.72, రూ.102, రూ.152 ధరలలో ఉన్నాయి. మొత్తం 5 డేటా ప్లాన్స్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
రూ.22 ప్యాక్ - 2GB డేటా - 28 రోజుల కాలపరిమితి
రూ.52 ప్యాక్ - 6GB డేటా - 28 రోజుల కాలపరిమితి
రూ.72 ప్యాక్ - ప్రతిరోజు 0.5GB డేటా - 28 రోజుల కాలపరిమితి
రూ.102 ప్యాక్ - ప్రతిరోజు 1GB డేటా - 28 రోజుల కాలపరిమితి

డెయిలీ లిమిట్ తర్వాత...
ఈ ఆఫర్లను 28 రోజుల కాలపరిమితితో అందిస్తోంది జియో. డెయిలీ ఎఫ్యూపీ అనంతరం ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకు పడిపోతుంది. గతవారం రూ.749తో ప్రత్యేక వార్షికప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత ఈ డేటా ప్యాక్లు ప్రకటించడం గమనార్హం. ఈ ప్యాక్ల్లో జియో యాప్స్ను ఉచితంగా అందిస్తోంది. అయితే కాల్స్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు లేవు.

కొత్త కస్టమర్ల కోసం..
జియో గతవారం జియో ఫోన్ యూజర్ల కోసం రూ.749 యాన్యువల్ ప్లాన్ను ప్రకటించింది. అలాగే కొత్త కస్టమర్లకు రూ.1999, రూ.1499 ప్లాన్స్ తీసుకు వచ్చింది. కాగా, తాజా 5 డేటా ప్లాన్స్తో జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో న్యూస్ వంటి జియో యాప్స్కు యాక్సెస్ కావొచ్చు. రూ,72 ప్లాన్లో రోజుకు 6.5 జీబీ చొప్పున 28 రోజులకు 14 జీబీ వస్తుంది. రూ.102 ప్లాన్లో రోజుకు 1 జీబీ చొప్పున 28 రోజులకు 28 జీబీ వస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications