Pharma News: భారత ఫార్మా కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో పొరుగు దేశం నేపాల్ దేశీయ ఫార్మా కంపెనీలపై నిషేధం విధించటం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిషేధం వల్ల సదరు కంపెనీల పేరు ప్రతిష్టలు సైతం మసకబారే అవకాశం ఉంది.

బాబా రామ్దేవ్..
దేశంలో ఎంతగానో ప్రజలకు చేరువైన యోగా గురు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి ఫార్మాస్యూటికల్స్ను తయారు చేసి విక్రయిస్తున్న దివ్య ఫార్మసీ కూడా నిషేధిత జాబితాలో ఉంది. ఈ మేరకు నేపాల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ నిషేధించింది.

పంపిణీ బంద్..
భారతదేశ ప్రసిద్ధ యోగా గురువు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి ఫార్మాస్యూటికల్స్ను తయారు చేసి విక్రయిస్తున్న దివ్య ఫార్మసీతో సహా 16 భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలను నేపాల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ నిషేధించింది. నేపాల్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. నిషేధిత జాబితాలో చేరిన 16 భారతీయ కంపెనీలు తయారు చేసిన మందులను నేపాల్లో దిగుమతి చేసుకోవడం లేదా పంపిణీ చేయడం కుదరదు.

నిషేధించబడిన కంపెనీలు..
ఇండియాస్ రేడియంట్ పేరెంటరల్స్ లిమిటెడ్, మెర్క్యురీ లాబొరేటరీస్ లిమిటెడ్, అలయన్స్ బయోటెక్, క్యాప్టాప్ బయోటెక్, అగ్లోమెడ్ లిమిటెడ్, జీ లేబొరేటరీస్, డాఫోడిల్స్ ఫార్మాస్యూటికల్స్, GLS ఫార్మా, యూనిజుల్స్ లైఫ్ సైన్సెస్, కాన్సెప్టువల్ లేబర్ సైన్సెస్, కాన్సెప్టువల్ లేబర్ సైన్సెస్, కాన్సెప్టువల్ లేబర్ సైన్సెస్, కాల్కేర్ ఫార్మాస్యూటికల్స్, మకూర్ లాబొరేటరీస్ కంపెనీలు నిషేధిత జాబితాలో నిలిచాయి. WHO ప్రమాణాలను పాటించటంలో విఫమైనందున ఈ చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.

మందులు వెనక్కి..
నేపాల్ ప్రభుత్వం నిషేథాన్ని ప్రకటించిన తరుణంలో అక్కడి మార్కెట్ల నుంచి ఔషధాలను వెనక్కి తీసుకోవాలని స్థానిక ఏజెంట్లను ఆదేశించింది. తయారీ కంపెనీల సౌకర్యాలను పరిశీలించేందుకు నేపాల్ డ్రగ్ ఇన్ స్పెక్టర్లను భారత్ కు పంపడం గమనార్హం. గ్లోబల్ హెల్త్కేర్ తయారు చేసిన 500 ml, 5 లీటర్ల హ్యాండ్ శానిటైజర్లను రీకాల్ చేయాలని ఆదేశించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications