రేటింగ్ ఏజెన్సీలు ఏమనుకుంటున్నాయనే అంశాన్ని పాలకులు పక్కన పెట్టాలని, ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కాబట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై దృష్టి సారించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సూచించారు. కరోనా తర్వాత సాధారణస్థితికి తిరిగి పుంజుకుంటామని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని పాలకులు దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగించాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన గ్లోబల్ మార్కెట్ ఫోరంలో మాట్లాడారు.

బంతి ప్రభుత్వం కోర్టులో
ఆర్బీఐ, ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయని, అయితే ఆర్థిక వ్యవస్థకు మరింతగా చేయాల్సిన బంతి ప్రభుత్వం కోర్టులో ఉందని రాజన్ అన్నారు. అయితే రుణాలు ఒత్తిడికి గురైన రంగాలు, సంస్థల వరకు చేరుతుందా అనే దానిపై దృష్టి సారించాలని సూచించారు. ప్యాకేజీ వంటి అంశాల గురించి మాట్లాడుతూ.. మరింతగా చేయాల్సి ఉందని, అలాగే ప్రాధాన్యతా అంశాలపై దృష్టి సారించాలన్నారు.

ఆర్థిక సామర్థ్యాలను పరిరక్షించాలి
క్రెడిట్ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలోకి వెళ్లిన ఏరియాలోకి వెళ్తుందా అనేది ముఖ్యమని, ఎందుకంటే దేశంలో వనరులు పరిమితమని, కాబట్టి దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేసులు రోజురోజుకు పెరగడం, ఆర్థిక వ్యవస్థలు కుంచించుకుపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సామర్థ్యాలను పరిరక్షించాలని, అప్పుడే కరోనా అనంతరం కార్యకలాపాలు సహేతుకమైనరీతిలో ప్రారంభం కాగలవన్నారు.

మారటోరియంతో సంక్షోభం..
రఘురాం రాజన్ ప్రభుత్వానికి, ఆర్బీఐకు కీలక సూచనలు చేశారు. రేటింగ్ ఏజెన్సీలను పరిగణలోకి తీసుకుంటే పెద్ద నిర్ణయాలు తీసుకోలేమని, లోన్ మారటోరియానికి ముగింపు పలకడం, ఒత్తిడికి గురైన ప్రాంతాలకు రుణాలు వెళ్లడంపై దృష్టి సారించాలని, పాలకులు ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. లోన్ మారటోరియం పొడిగిస్తే బ్యాంకులు సంక్షోభంలోకి వెళ్తాయని హెచ్చరించారు. మారటోరియంతో బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతుందని, అలాగే రుణగ్రహీతలను తిరిగి చెల్లింపులు చేసే అలవాటును చేయడం కష్టమని గతంలోనే అభిప్రాయపడ్డారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించారు. జూన్ నెల నుండి అన్-లాక్ ప్రారంభమైంది. అయితే కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు నగరాల్లో లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఆశలను నిరోధిస్తోంది. పేద, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు సాయం చేసేందుకు ప్రభుత్వం, ఆర్పీఐ పలు కార్యక్రమాలు చేపట్టింది. జీడీపీలో 10 శాతం ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాస్తవంగా ఇది ఒకటి నుండి రెండు శాతం మాత్రమేననే వాదనలు ఉన్నాయి. ఆర్బీఐ కూడా కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు పలు పర్యాయాలు 115 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్న రుణాల పునర్వ్యవస్థీకరణకు గురువారం ఆర్బీఐ పచ్చజెండా ఊపింది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications