Reliance News: 2016లో టెలికాం వ్యాపారంలోకి అడుగుపెట్టిన ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో అతిపెద్ద మ్యాజిక్ చేసింది. మార్కెట్లోని ఇతర వ్యాపారులు కనుమరుగయ్యేలా చేసింది. ఉచితాలతో ఆకట్టుకుని కస్టమర్లను సముపార్జించింది. అయితే ప్రస్తుతం కంపెనీ ఇదే స్టాటజీనికి మీడియా వ్యాపారంలోనూ కొనసాగిస్తోంది. జియో దెబ్బకు ప్రపంచ దిగ్గజ సంస్థ డిస్నీ సైతం తన వ్యాపారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితికి దిగజారింది.
చాలా కాలంగా రిలయన్స్ మీడియా విభాగం వయాకామ్ 18, అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీ మధ్య కొనుగోలుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఒప్పందానికి నేషనల్ లా ట్రైబ్యునల్ ముంబై శాఖ నుంచి కీలక అనుమతులు లభించాయి. దీంతో రిలయన్స్ వయాకామ్ 18, వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియా కలయికకు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయ్యింది. విలీన పథకానికి ఆమోదం పొందేందుకు వారి సురక్షితమైన, అసురక్షిత రుణదాతలతో సమావేశాలు నిర్వహించమని కోరింది.

విలీన ప్రక్రియ రెండు దశల్లో కొనసాగనుంది. మెుదటగా వయాకామ్ 18 ఆస్తులను డిజిటల్ 18కి బదలాయింపు జరుగుతుంది. దీని తర్వాత వీటిని స్టార్ ఇండియా కోసం డీమెర్జర్ చేయబడతాయి. దీని తర్వాత ఏర్పడే కొత్త సంస్థకు ఏకంగా దేశంలో 100 టీవీ ఛానల్స్, రెండు స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్లు ఉండనున్నాయి. ప్రస్తుతం డిస్నీ+ హాట్ స్టార్, జియో సినిమాలకు దాదాపు 750 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. మెర్జర్ తర్వాత సంయుక్తంగా ఏర్పడే సంస్థ మార్కెట్ విలువ రూ.70,352 కోట్లు లేదా 8.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కొత్తగా ఏర్పడే మీడియా దిగ్గజ సంస్థకు నీతా అంబానీ ఛైర్ పర్సన్, ఉదయ్ శంకర్ వైస్ చైర్ పర్సన్ గా వ్యవహరించనున్నారు.
వాస్తవానికి దీనికి ముంది దేశంలో సోనీ-జీ సంస్థల మెర్జర్ ప్రక్రియ కొనసాగాల్సి ఉన్నప్పటికే గడువులోగా అది పూర్తి కాకపోవటంతో రద్దు చేయబడింది. అయితే ఈ రద్దుతో దేశంలోని మీడియా వ్యాపారంలో అంబానీకి పెద్ద అడ్వాన్టేజ్ ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో 28 బిలియన్ డాలర్ల మీడియా వ్యాపారంలో అంబానీ కీలక పాత్ర పోషించనున్నారు. వాస్తవానికి జియో క్రికెట్ మ్యాచ్ లను ఉచితంగా స్ట్రీమ్ చేయటంతో.. భారతదేశంలో డిస్నీ స్ట్రీమింగ్ సర్వీసెస్ పెద్ద సంఖ్యలో చందాదారులను కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ప్లాట్ఫారమ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఫలితంగా డిస్నీ ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు స్మార్ట్ఫోన్లలో ఉచిత క్రికెట్ స్ట్రీమింగ్ను అందించాల్సి వచ్చింది. చివరికి పోటీలో నిలవలేక తిరిగి అంబానీ చేతికే తన వ్యాపారాన్ని విక్రయిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications