రష్యాతో స్నేహం మానేయండి.. భారత్, చైనాలకు నాటో హెచ్చరిక.. కారణం ఏంటంటే..

ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ నాటో.. అగ్రదేశాలకు కీలకమైన హెచ్చరికను జారీ చేసింది. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించవద్దని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే భారత్, చైనా, బ్రెజిల్‌లను తీవ్రంగా హెచ్చరించారు. రష్యాతో ఈ దేశాలు వాణిజ్యాన్ని కొనసాగిస్తే వారు తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 100 % సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది .

ఇక రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామని అమెరికన్ రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన సంగతి విదితమే. రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుందని ఆయన హెచ్చరించారు.

NATO warning Russian oil India buying Russian oil China Brazil Russian crude NATO sanctions warning Russian oil imports global energy politics NATO oil ban India Russia energy trade Brazil Russia crude oil NATO vs Russia oil trade NATO

తాజాగా NATO నుంచి కూడా హెచ్చరిక రావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అమెరికా 500 శాతం సుంకాలు విధిస్తామని బెదిరిస్తే నాటో 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరికలకు దిగింది. దీంతో పాటుగా శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు నాటో సెక్రటరీ జనరల్.

ఇదిలా ఉంటే భారత్ , చైనా దేశాలు రష్యా నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్చరిక వచ్చింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో శాంతిని నెలకొల్పడానికి వీలుగా శాంతి చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన ఈ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 50 రోజుల్లోపు శాంతి ఒప్పందం కుదరకపోతే, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకం విధించబడుతుందని ట్రంప్ అన్నారు.

2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత కూడా బ్రిక్స్ గ్రూపులోని ప్రధాన దేశాలైన భారతదేశం, చైనా, బ్రెజిల్.. మాస్కో నుండి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశం రష్యా నుండి ముడి చమురును దిగుమతి చేసుకునే ప్రధాన దేశంగా ఉంది. తాజాగా ఆంక్షలు విధిస్తే ఈ దేశాలు ఇంధన సరఫరాలో అంతరాయాలు, ధరల పెరుగుదల, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటాయి.

అయితే భారతదేశం ఎల్లప్పుడూ తన జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, రష్యాతో తన వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఇటీవల పెరిగింది. చమురు, రక్షణ రంగాలలో ఇది మరింతగా పెరిగింది. బ్యూటైల్ రబ్బరు ప్లాంట్, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ వంటి ప్రాజెక్టులలో భారతదేశం రష్యాతో సహకారాన్ని కూడా పెంచుకుంటూ వస్తోంది.

రష్యాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవడం భారతదేశంలోని అనేక రంగాలను ప్రభావితం చేస్తుంది, వీటిలో ఇంధనం, రక్షణ, వాణిజ్యం ప్రధానమైనవి.రష్యాతో భారతదేశం సంబంధాలు తెగిపోతే, భారతదేశంలో చమురు ధరలు పెరగవచ్చు. భారతదేశం చమురు, వాయువు కోసం ఇతర వనరులను కనుగొనవలసి ఉంటుంది. ఇది ఖరీదైనదిగా మారవచ్చు. ఇది భారతదేశ రక్షణ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రెండు దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలు, సాంకేతిక సహకారం ప్రభావితం కావచ్చు, ఇది భారతదేశం వ్యూహాత్మక స్థానాన్ని ప్రభావితం చేయవచ్చు.

రష్యా భారతదేశానికి ఆధునిక సాంకేతిక ఆయుధాలను అందిస్తుంది. ఇది S-400 క్షిపణి వ్యవస్థలను కూడా సరఫరా చేస్తుంది. రష్యాతో సంబంధాలు తెగిపోతే, భారతదేశం రక్షణ రంగానికి అమెరికా లేదా యూరోపియన్ దేశాలను సంప్రదించవలసి ఉంటుంది.అయితే ఈ హెచ్చరికపై రష్యా స్పందించింది.. మాస్కో కొత్త ఆంక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. రష్యా ఇప్పటికే అపూర్వమైన ఆంక్షలను ఎదుర్కొంటోందని, ఏదైనా కొత్త ఒత్తిడిని తట్టుకోగలదని తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+