sample survey: నేషనల్ సర్వేలో ఆసక్తికర విషయాలు.. విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

sample survey: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అతి త్వరలోనే మూడో స్థానాన్ని చేజిక్కించుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో దేశంలోని విద్య, ఉపాధి, నివాసం, మంచినీరు, ఇంధనం వంటి అత్యవసరాల పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఓ లక్ష్యాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఆ దిశగా వేగంగా ముందుకు సాగగలం.

విద్య, ఉపాధి అవకాశాలు పెరిగనట్లేనా?

విద్య, ఉపాధి అవకాశాలు పెరిగనట్లేనా?

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(NSSO) దేశంలో జరిపిన MIS సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. విద్య, ఉపాధి అవకాశాలతో పాటు ఇతర రంగాల్లో ప్రజల శక్తియుక్తులు బయటపడ్డాయి. 15-24 వయసు గల భారతీయుల్లో.. 29.3 శాతం మంది విద్య, ఉపాధి లేదా శిక్షణలో లేరని తేలింది. పూర్వం 15-29 వయసులోని యువకుల్లో ఇది 35 శాతంగా ఉండేదని తెలుస్తోంది. సర్వేకు ముందు 3 నెలల డేటా చూస్తే 18 ఏళ్లు పైబడిన దాదాపు 73 శాతం మంది మొబైల్ ఫోన్లను ఉపయోగించినట్లు వెల్లడైంది.

అర్బన్, రూరల్ మధ్య భారీ వ్యత్యాసం:

అర్బన్, రూరల్ మధ్య భారీ వ్యత్యాసం:

మార్చి 31, 2014 తర్వాత సుమారు 10 శాతం కుటుంబాలు కొత్తగా, 50 శాతం మొదటిసారిగా ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేశారు. 63 శాతం గృహాలకు వంట కోసం స్వచ్ఛ ఇంధనం అందుబాటులో ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను పోల్చి చూస్తే ఈ తేడా చాలా అధికంగా ఉంది. రూరల్ ఏరియాల్లో 50 శాతం ఉంటే అర్బన్ లో 92 శాతం ఈ ఇంధనాన్ని వినియోగించే వారున్నారు. LPG, న్యాచురల్ గ్యాస్, గోబర్ గ్యాస్, బయోగ్యాస్, సోలార్ మరియు పవన విద్యుత్తును స్వచ్ఛ ఇంధనంగా సర్వే గుర్తించింది.

నీరు, మరుగుదొడ్డి వసతులు భేష్:

నీరు, మరుగుదొడ్డి వసతులు భేష్:

ఇక దేశంలో 96 శాతం మందికి మంచినీటి వనరులు ఉన్నాయి. అంటే పూర్తిగా ఇంటిలోకి నల్లా కనెక్షన్, పబ్లిక్ ట్యాప్, హ్యాండ్ పంప్, వర్షపు నీరు సేకరణ, ప్రభుత్వ లేదా ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా సప్లయి వంటి అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయిలో ఉన్నారన్నమాట. 98 శాతం ప్రజలకు వివిధ రకాల మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. 82 శాతం మందికి తమ ప్రాంగణంలోనే సబ్బు లేదా డిటర్జెంటుతో చేతులు కడుక్కునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

ఎందుకీ సర్వే..

ఎందుకీ సర్వే..

కొన్ని ముఖ్యమైన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDG) సూచికల అంచనాలను అభివృద్ధి చేయడం కోసం సమాచారాన్ని సేకరించడం మల్టిపుల్ ఇండికేటర్ సర్వే(MIS) లక్ష్యం. 2020లో దీన్ని నిర్వహించాలని మొదట భావించారు. కానీ కొవిడ్-19 కారణంగా ఫీల్డ్ వర్కును ఆగస్టు 15, 2021 వరకు పొడిగించారు. కాగా దేశమంతటా తన 78వ విడత సర్వేను NSSO తాజాగా పూర్తిచేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+