Diabetes Drugs: మధుమేహ వ్యాధిగ్రస్థులకు శుభవార్త.. డయాబెటిక్ మందుల ధరలు తగ్గే అవకాశం..!

దేశంలో రోజురోజుకు మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో దాదాపు తొమ్మిది శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. కొన్ని పట్టణ ప్రాంతాలలో 11 శాతం దాటింది.అయితే మధుమేహం సహా వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగించే 45 రకాల మందులకు గరిష్ఠ చిల్లర ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) చేంజే చేసింది.

అనేక రకాల సిటాగ్లిప్టిన్‌..
మధుమేహ వ్యాధిగ్రస్తులు వినియోగించే సిటాగ్లిప్టిన్‌ + మెట్‌ఫామిన్‌, లినాగ్లిప్టిన్‌ + మెట్‌పామిన్‌ సమ్మిళిత ఔషధాల ధరల్లో మార్పు చేసింది. అయితే సిటాగ్లిప్టిన్‌పై 'మెర్క్‌షార్ప్‌ అండ్‌ డోమ్‌ (MSD)'కు ఉన్న పేటెంట్ హక్కుల కాలపరిమితి గతనెలతో ముగిసిన విషయం తెలిసిందే.దీంతో మిగతా కంపెనీలు అనేక రకాల సిటాగ్లిప్టిన్‌ జనరిక్‌ ఔషధాలను మార్కెట్ లో ప్రవేశపెట్టాయి.

National Pharmaceutical Pricing Authority decrease the Diabetes Drugs Rates

సిటాగ్లిప్టిన్‌ లేదా లినాగ్లిప్టిన్‌
ప్రస్తుతం మార్కెట్‌లో 15 మాత్రలు ఉండే సిటాగ్లిప్టిన్‌ + మెట్‌ఫామిన్‌ ప్యాక్‌ను గరిష్ఠంగా రూ.345 వరకు అమ్ముతున్నాయి. అయితే వీటి ధరలను NPPA సవరించింది. 2.5 ఎంజీ మాత్ర ధరను రూ.16.17, 5 ఎంజీ ట్యాబ్లెట్‌ ధరను రూ.25.33గా నిర్ణయించింది. టైప్‌-II మధుమేహంతో బాధపడుతున్న వారిలో 30 శాతం మందికి వైద్యులు సిటాగ్లిప్టిన్‌ లేదా లినాగ్లిప్టిన్‌ సిఫార్సు చేస్తారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+