సక్సెస్ స్టోరీస్ మనం తరచుగా చూస్తుంటాం... కాని కొన్నిసార్లు విధ్వంసాలకి సంబంధించిన స్టోరీస్ చదివే పరిస్థితి కూడా వస్తుంది. జెట్ ఎయిర్వేస్ అలాగే దాని ఓనర్ నరేష్ గోయల్ విషయంలో కూడా అదే జరిగింది. ఒకప్పుడు ఆకాశాన్ని ఏలిన జెట్ ఎయిర్వేస్ ఇప్పుడు మూతపడింది. నరేష్ గోయల్ తన జీవితంలోని చివరి దశలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాడు. కాగా ప్రస్తుతం అతను బెయిల్పై ఉంటూ ఇటీవల దేశవ్యాప్తంగా ప్రయాణించడానికి అనుమతి కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

249 రోజులు జైలులోనే : నిజానికి, నరేష్ గోయల్ న్యూరో-ఎండోక్రైన్ ట్యూమర్ లాంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు ఇండియాలోని వివిధ వైద్య సంస్థల నుండి అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు. గోయల్ సోదరి కూడా క్యాన్సర్ తో బాధపడుతోంది, కాబట్టి అతను ఆమెను కూడా కలవాలనుకుంటున్నాడు. ఆయన పిటిషన్ దాఖలు చేసినట్లు ఈ నెల ప్రారంభంలో వార్తలు వచ్చాయి. 249 రోజుల పాటు కస్టడీలో ఉన్న తర్వాత 6 మే 2024న గోయల్కు మధ్యంతర బెయిల్ లభించింది. అయితే గోయల్ 1 ఏప్రిల్ 1992న జెట్ ఎయిర్వేస్ను స్థాపించారు, అది 1993లో కార్యకలాపాలను ప్రారంభించింది.
రెండు బోయింగ్ విమానాలతో : గోయల్ రెండు బోయింగ్ 737 విమానాలతో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే ఈ విమాన సంస్థ భారత ఆకాశంలో ఎగిరింది. దింతో గోయల్ ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఈ ఎత్తు నుండి అతను కంపెనీకి సంబంధించి వస్తున్న ఆందోళనలు, భయాలను గ్రహించడం మానేశాడు, ఆఖరికి సూచనలను కూడా పట్టించుకోలేదు. తర్వాత కాలం మలుపు తిరిగింది, గాలితో విహరిస్తున్న జెట్ ఎయిర్లైన్ తిరిగి ఎగరలేని విధంగా ఒక్కసారి నేలపైకి వచ్చింది. మళ్ళీ జెట్ ఎయిర్ వేస్ను ఆకాశంలోకి ఎగిరేలా గోయల్ చాలా కష్టపడ్డాడు.
టాటా ఆసక్తి : ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ 17న మూసివేసింది, కానీ ఈ సంకేతాలు చాలా ముందుగానే వినిపించాయి. నరేష్ గోయల్ కు కూడా చాలా చెడు జరగవచ్చని తెలుసు, అయిన అతను ఒకదాని తర్వాత ఒకటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాడు. సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ను కాపాడటానికి ఆర్థిక సలహాదారులు గోయల్ వెనక్కి తగ్గాలని సూచించారు. ఆ సమయంలో టాటా గ్రూప్ కూడా జెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపింది, కానీ గోయల్ అంగీకరించలేదు. కానీ అప్పుడు అతను ఒప్పుకుంటే, బహుశా పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది.
డెల్టా ఆఫర్ కూడా తిరస్కరణ: కొన్ని నివేదికల ప్రకారం వ్యాపారాన్ని మూసివేయడానికి కొన్ని రోజుల ముందు వరకు జెట్ ఎయిర్వేస్ ప్రతిరోజూ దాదాపు రూ.21 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2017లో డెల్టా ఎయిర్లైన్స్ కూడా జెట్లో కొంత వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. అబుదాబి ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎతిహాద్ ఇప్పటికే జెట్ భాగస్వామిగా ఉంది.
స్వార్థపరుడిగా మారిపోయిన గోయల్ : నరేష్ గోయల్ సన్నిహితులు, అతను సక్సెస్ శిఖరాలకు చేరుకున్న తర్వాత కొంత గర్వంగా మారాడని చెప్పారు. తాను నమ్మకంగా ఉన్న వ్యక్తుల సామర్థ్యాలను కూడా అతను పట్టించుకోలేదు. జెట్ ఎయిర్వేస్ను తానే నడుపుతున్నానని, తన సమక్షంలో కంపెనీకి ఎం జరగదనే భ్రమలో ఉన్నాడు. కానీ సంక్షోభాన్ని పట్టించుకోకుండా ఇతరుల సలహాలను పాటించడం వల్ల అతనికి భారీ నష్టం వాటిల్లింది.
40% మార్కెట్ వాటా నుండి 0%కి: 2004లో జెట్ ఎయిర్వేస్ ఒక్కటే భారతీయ ఆకాశంలో 40% వాటాతో ఉంది, కానీ కొత్త కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు, గోయల్ కంపెనీని ముందుకు సాగడంలో చాలా కష్టమైన మార్గంలోకి తీసుకెళ్లాడు. ఇండిగో, స్పైస్ జెట్లతో పోటీ పడటానికి నరేష్ గోయల్ మొదట ధరల యుద్ధంలో నిలిచాడు, తరువాత లోన్ భారాన్ని పెంచుతూ వచ్చాడు. ఆయన 2007లో ఎయిర్ సహారాను రూ.1450 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే సలహాదారులు ఈ ఒప్పందానికి దూరంగా ఉండాలని అతనికి సలహా ఇచ్చారు. చివరికి ఎయిర్ సహారాను కొనుగోలు చేయడం వల్ల జెట్ ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది.
కంపెనీ అప్పుతో కొత్త విమానాలు : జెట్ ఎయిర్వేస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు, కంపెనీ IPO నుండి వచ్చిన డబ్బును లోన్ భారాన్ని తగ్గించుకోవడానికి ఖర్చు చేస్తుందని నమ్మించాడు. కానీ నరేష్ గోయల్ కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. 2012లో కింగ్ఫిషర్ మూతపడినప్పుడు, విజయ్ మాల్యా తప్పుల నుండి నేర్చుకునే అవకాశం నరేష్ గోయల్కు లభించింది, కానీ బహుశా అతను అలా చేయాల్సిన అవసరం లేదని భావించి ఉండవచ్చు. జెట్ అప్పుల్లో ఉన్నప్పటికీ, అతను 10 ఎయిర్బస్ A330, బోయింగ్ 777 విమానాలను ఆర్డర్ చేశాడు. మీడియా నివేదికల ప్రకారం, ఇటువంటి విమానాలలో 400 సీట్లు ఉండగా, జెట్ అందుకున్న విమానంలో కేవలం 308 సీట్లు మాత్రమే ఉన్నాయి. దీని కారణంగా కంపెనీ ఆశించిన విధంగా సంపాదించలేకపోగా, నష్టాల భారం పెరుగుతూనే ఉంది.
జెట్ ఎయిర్వేస్ విమానాల్లో 8 ఫస్ట్ క్లాస్ సీట్లు ఉన్నాయని, ఈ కారణంగా ఆదాయాలు బాగా తగ్గుతున్నాయని అందువల్ల ఈ సీట్లను జనరల్ సీట్లుగా మార్చమని అధికారులు అతనికి సలహా ఇచ్చారు, కానీ గోయల్ ఎప్పటిలాగే ఈ సూచనను పట్టించుకోలేదు. అతను సలహాలను, సూచనలను పదే పదే తిరస్కరిస్తూనే ఉన్నాడు, ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతున్న జెట్ విమానాలు నేలపైనే ఇరుక్కుపోయే రోజు వచ్చింది. జెట్ ఎయిర్వేస్ ఆకాశంలో ఎగరడానికి 17 ఏప్రిల్ 2019 చివరి రోజు. దీని తరువాత కంపెనీ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ సక్సెస్ కాలేదు.
దర్యాప్తులు, జైలు: జెట్ ఎయిర్వేస్ సంబంధిత విషయాలపై దర్యాప్తు ముమ్మరం కావడంతో నరేష్ గోయల్ చుట్టూ ఉచ్చు బిగింది. ఈ దర్యాప్తులో ED, CBI, ఆదాయపు పన్ను వంటి సంస్థలు చేరాయి. నరేష్ గోయల్ ఆయన భార్య అనితా గోయల్, జెట్ ఎయిర్వేస్ మాజీ డైరెక్టర్ గౌరంగ్ ఆనంద్ శెట్టిలను నిందితులుగా సీబీఐ చేర్చింది. మనీలాండరింగ్ కేసులో గోయల్ను ED సెప్టెంబర్ 2023లో అరెస్టు చేసింది. కెనరా బ్యాంక్ జెట్ ఎయిర్వేస్కు ఇచ్చిన రూ.538.62 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేశాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వైద్య కారణాల వల్ల గోయల్కు మే 6, 2024న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నరేష్ గోయల్ భార్య క్యాన్సర్ కారణంగా మరణించారు, గోయల్ కూడా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు.
జూన్ 2021లో, యుఎఇ వ్యాపారవేత్త మురారి లాల్ జలన్, లండన్కు చెందిన కల్రాక్ క్యాపిటల్ల కన్సార్టియం దివాలా ప్రక్రియ కింద ఎయిర్లైన్ను కొనుగోలు చేయడానికి అంగీకరించింది, దీనితో జెట్ ఎయిర్వేస్ మళ్లీ విమానాలు నడపగలదనే ఆశలు రేకెత్తాయి. అయితే, ఇది జరగలేదు. గత సంవత్సరం, సుప్రీంకోర్టు ఎయిర్లైన్ ఆస్తులను విక్రయించాలని ఆదేశించింది. జెట్ ఎయిర్లైన్స్ ఇకపై ఎప్పటికీ విమానాలు నడపలేదనేది అప్పుడు స్పష్టమైంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications