సొంత ఇల్లు అనేది ప్రతిఒక్కరి కల. అయితే అన్ని వసతులతో కూడిన ఇల్లు అంటే ఎవరు వొద్దంటారు. ఈ కాలంలో ఆర్కిటెక్చర్ చాల ముందంజలో ఉంది. స్థలం ఉంటె చాలు తక్కువ సమయంలోనే అన్ని లగ్జరీ సదుపాయాలతో ఇల్లు కట్టి అందిస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి బెంగళూరులో ఒక లగ్జరీ ఫ్లాట్ను కొన్నారు. ఈ ఫ్లాట్ ధర నోయిడా వంటి నగరంలో 25 కంటే ఎక్కువ విల్లాలను కొనొచ్చు. నారాయణ మూర్తి ఈ కొత్త ఫ్లాట్లో ఎన్నో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
బెంగళూరులో మూర్తి కొన్న ఈ ఫ్లాట్ ప్రదేశం ఖరీదైన ప్రదేశాలలో ఒకటి. బెంగళూరులోని యూబీ సిటీలోని కింగ్ఫిషర్ టవర్స్లో నారాయణ మూర్తి ఈ ఫ్లాట్ను కొన్నారు. ఈ టవర్లో మూర్తిది రెండవ ఫ్లాట్. ఈ కొత్త ఫ్లాట్ ధర రూ.50 కోట్లు అని చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే టవర్లోని 23వ అంతస్తులో నారాయణమూర్తి, భార్య సుధామూర్తి రూ.29 కోట్లతో ఫ్లాట్ను కొన్నారు.

కొత్త ఫ్లాట్ ఎంత పెద్దది?
16వ అంతస్తులో విలాసవంతమైన ఈ నాలుగు బెడ్ రూమ్స్ ఫ్లాట్ 8400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఐదు కార్ పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, దీని ధర చదరపు అడుగుకు రూ. 59,500గా చెప్తున్నారు. నారాయణమూర్తి ఈ ఫ్లాట్ను ఓ ముంబై వ్యాపారవేత్త నుంచి కొన్నారు. ఈ వ్యాపారవేత్త దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ ఫ్లాట్ను కొన్నారు.
విజయ్ మాల్యాతో పేరుతో
యూబీ సిటీ పేరు విజయ్ మాల్యాతో ముడిపడి ఉంది. 4.5 ఎకరాలలో విస్తరించి ఉన్న UB సిటీలోని కింగ్ఫిషర్ టవర్స్ నగరం నడిబొడ్డున మూడు బ్లాకుల్లో 81 ప్రత్యేకమైన అపార్ట్మెంట్లు ఉన్నాయి. 34 అంతస్తుల భవనంలో ఒక్కో ఫ్లాట్ దాదాపు 8,321 చదరపు అడుగులు. విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉన్న స్థలంలో ఈ టవర్లు నిర్మించారు.
ప్రెస్టీజ్ తన వాటా కింగ్ఫిషర్ టవర్స్లోని 41 లగ్జరీ అపార్ట్మెంట్లను విక్రయించింది, ఇది 2010లో ప్రెస్టీజ్ గ్రూప్ అండ్ మాల్యా మధ్య జాయింట్ డెవలప్మెంట్. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు, అపార్ట్మెంట్లు చదరపు అడుగుకు రూ. 22,000 చొప్పున విక్రయించారు. ఇప్పుడు దీని ధర రెండింతలు పెరిగింది.
కోట్ల విలువైన ఆస్తులు కొన్నారు
రెండేళ్ల క్రితం కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్ రూ.35 కోట్ల విలువైన ఫ్లాట్ను కొన్నారు. 2017లో ఎంబసీ గ్రూప్, ఇంజినీరింగ్ ఔట్సోర్సింగ్ కంపెనీ క్వెస్ట్ గ్లోబల్ ఛైర్మన్ అండ్ CEO అయిన అజిత్ ప్రభుకి ఒక అపార్ట్మెంట్ను రూ. 50 కోట్లకు విక్రయించింది, ఇది ఇప్పటివరకు బెంగళూరులో అతిపెద్ద హోమ్ డీల్. హెబ్బాల్ సమీపంలోని ఎంబసీ వన్లో 16 వేల చదరపు అడుగుల అపార్ట్మెంట్ను చదరపు అడుగుకు దాదాపు రూ.31 వేల చొప్పున అజిత్ ప్రభు కొన్నారు.
More From GoodReturns

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్కు ముగింపు పలికిన కంపెనీ

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..



Click it and Unblock the Notifications