అక్టోబర్ 2న సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు కర్ణాటక ఐటీ-బీటీ మంత్రి "ప్రియాంక్ ఖార్గే" మధ్య ఘాటు మాటల యుద్ధం సాగింది. ఈ ఆన్లైన్ వార్కు కారణం లోకేష్ బెంగళూరులోని కంపెనీలను ఆంధ్రప్రదేశ్లోని "అనంతపురం" వైపు కార్యకలాపాలు మార్చాలని ఓపెన్ ఆహ్వానం ఇవ్వడమే.
లోకేష్ మనీ కంట్రోల్ ప్రచురించిన "ఔటర్ రింగ్ రోడ్... స్టార్టప్లు, కంపెనీలు ఉత్తర బెంగళూరు-వైట్ఫీల్డ్ వైపు మళ్లుతున్నాయి" అనే కథనాన్ని కోట్ చేస్తూ X (ట్విట్టర్)లో ఇలా రాశారు "ఉత్తరం బాగానే ఉంది... మరింత ఉత్తరం అంటే అనంతపురం. అక్కడ మేము ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తున్నాం!" సాధారణంగా చెప్పాలంటే, "బెంగళూరులో ఉత్తరం బాగానే ఉంది కానీ ఇంకొంచెం ఉత్తరం అంటే అనంతపురం, అక్కడ మేము ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, డిఫెన్స్ సిస్టమ్ను తయారు చేస్తున్నాం" అని అన్నారు.

ఈ ట్వీట్ పై ప్రియాంక్ ఖార్గే ఘాటు ప్రతిస్పందన ఇచ్చారు. ఆయన ట్వీట్లో "బలహీన ఎకోసిస్టమ్లు బలమైన వాటి పై ఆధారపడటం సహజం. అందులో తప్పేమీ లేదు. కానీ అది 'డెస్పరేట్ స్కావెంజింగ్' స్థాయికి వెళ్ళినప్పుడు, బలహీనత ఇంకా స్పష్టమవుతుంది" అంటూ వ్యాఖ్యానించారు. అంటే, లోకేష్ ఆహ్వానం పట్ల ఆయన నేరుగా దాడి చేయకపోయినా, పదాలతో బలమైన పంచ్ వేశారు.
అంతేకాక, ఖార్గే బెంగళూరుకు ఉన్న బలమైన పునాదులను కూడా గుర్తు చేశారు. ఆయన వివరించిన దాని ప్రకారం బెంగళూరులో జీడీపీ వృద్ధి రేటు 2035 వరకు 8.5% ఉండే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న నగరంగా నిలుస్తుందని చెప్పారు. 2025లో రియల్ ఎస్టేట్ మార్కెట్ 5% పెరుగుతుందని అంచనా. సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం, 2033 నాటికి నగరీకరణ, ఆర్థిక వృద్ధి, ఇన్నోవేషన్ విషయాల్లో బెంగళూరు అనేక అంతర్జాతీయ నగరాలను మించబోతోంది. 2025 నాటికి బెంగళూరు పట్టణ జనాభా 1.44 కోట్లు చేరే అవకాశం ఉందని, వార్షిక వృద్ధిరేటు 2.76%గా ఉంటుందని ఆయన వివరించారు. దేశంలోనే అత్యధిక మైగ్రంట్లను స్వీకరిస్తున్న నగరాల్లో కూడా బెంగళూరు అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..
ఖార్గే మరో పంచ్ కూడా వేశారు. "ప్రస్తుతం జరుగుతున్న వేగవంతమైన వృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే ఉంటుంది," అని చెప్పి, చివర్లో వ్యంగ్యంగా "BTW, ఒక జీవి మరో జాతికి చెందిన జీవి పై లేదా దానిలో నివసిస్తూ, దాని ఖర్చు పై పోషకాలు పొందుతూ జీవించే జీవిని ఏమంటారు?" అని ప్రశ్నించారు. ఇది పరోక్షంగా లోకేష్ పిచ్ను 'పారాసైట్' తో పోల్చిన పోస్ట్ బాగా వైరల్ అయింది.
ఇక ఇది లోకేష్ మొదటిసారి చేస్తున్న ప్రయత్నం కాదు. ఆయన ఇప్పటికే పలు సార్లు బెంగళూరు కంపెనీలకు ఆహ్వానం పలికారు. సెప్టెంబర్ 23న బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితుల పై ఒక లాజిస్టిక్స్ స్టార్టప్ CEO చేసిన వైరల్ పోస్టు తరువాత, లోకేష్ "హ్యాపీ టూ హెల్ప్! మా వైజాగ్ ఆఫర్ ఇంకా ఉంది! నవంబర్ 14-15 తేదీల్లో AP ప్రభుత్వ-CII భాగస్వామ్య సదస్సుకి రండి" అంటూ ట్వీట్ చేశారు.
అంతకుముందు, సెప్టెంబర్ 17న బ్లాక్బక్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యబాజీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కార్యకలాపాలు తరలించాలన్న నిర్ణయాన్ని ప్రకటించగానే, లోకేష్ "హాయ్ రాజేష్, మీ కంపెనీని వైజాగ్కి మార్చుకోవడంలో ఆసక్తి ఉందా? మేము దేశంలో టాప్ 5 స్వచ్ఛమైన నగరాల్లో ఒకటిగా ఉన్నాం, ఉత్తమ ఇన్ఫ్రా ఉంది, మహిళలకు సురక్షిత నగరంగా రేటింగ్ వచ్చింది. DM చేయండి" అంటూ నేరుగా ఆహ్వానించారు.
జూలైలో కూడా ఆయన ఏరోస్పేస్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం కెంపేగౌడ విమానాశ్రయం వద్ద 1,777 ఎకరాల ఏరోస్పేస్ పార్క్ ప్రాజెక్టును రద్దు చేసిన వెంటనే, లోకేష్ "ప్రియమైన ఏరోస్పేస్ పరిశ్రమ, ఈ విషయం వినడం బాధాకరం. కానీ నా దగ్గర మంచి ఆప్షన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి. ఇక్కడ ఆకర్షణీయమైన పాలసీ, ఉత్తమ ప్రోత్సాహకాలు, బెంగళూరు పక్కనే 8,000 ఎకరాల రెడీ-టు-యూజ్ ల్యాండ్ ఉంది. త్వరలో మీతో టేబుల్ వద్ద మాట్లాడాలని ఉంది" అంటూ ట్వీట్ చేశారు.
మొత్తానికి, వైజాగ్ తర్వాత ఇప్పుడు "అనంతపురాన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్ హబ్గా" ప్రొజెక్ట్ చేయడం పై లోకేష్ దృష్టి పెట్టగా, ఖార్గే మాత్రం బెంగళూరుకు ఉన్న బలమైన వృద్ధి అవకాశాలను చూపిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఇది రాజకీయ తగాదా మాత్రమే కాదు దక్షిణ భారతీయ టెక్ నగరాల మధ్య పోటీకి ఇది మరో ఆసక్తికర మలుపు అని చెప్పొచ్చు.
More From GoodReturns

పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications