N Chandrasekaran: గత ఏడాది భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా వయోభారంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిరంతరం దేశం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలను మెరుగుపరచటానికి ప్రయత్నించిన రతన్ టాటా తన మరణం తర్వాత కూడా తన ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నారు. ఆయన మరణం తర్వాత కూడా వంటవాడు, శంతను నాయుడికి ప్రయోజనం కలిగేలా వీలునామా రాసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఆయన మరణించిన చాలా వారాల తర్వాత ఆసక్తికర సంఘటన చోటుచోసుకుంది. టాటా సన్స్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. దీనిని దివంగత రతన్ టాటా స్థాపించారు. టాటా తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఈ ఫౌండేషన్కు దాతృత్వ సేవలకు వినియోగించటం కోసం అందించారు. రతన్ టాటా దీని బాధ్యతలను చంద్రశేఖరన్ చూసుకోవాలని కోరుకోవటంతో.. న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత చంద్రశేఖరన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తారని వర్గాలు తెలిపాయి.

టాటా సన్స్ ఛైర్మన్ టాటా ట్రస్ట్ ఛైర్మన్గా ఉండకుండా నిరోధించే నియమం ఇక్కడ వర్తించదు ఎందుకంటే ఈ ఫౌండేషన్ టాటా ట్రస్ట్తో అనుసంధానించబడి లేదు. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా ఈ ఫౌండేషన్లో ఎలాంటి భాగస్వామి కానందున చంద్రశేఖరన్ దీని బాధ్యతలు చేపట్టడానికి అర్హులుగా తెలుస్తోంది. ప్రస్తుతం రతన్ టాటా మరణం తర్వాత ఆయన సంకల్పాన్ని డారియస్ ఖంబాటా, మెహ్లి మిస్త్రీ, షిరిన్ అండ్ డయానా జెజిభోయ్ లు ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడైంది. RTEF బోర్డులో ట్రస్టీల నియామకానికి సంబంధించి స్పష్టమైన లిఖిత సూచనలు లేవు.
రతన్ టాటా గత ఏడాది అక్టోబర్లో 86 ఏళ్ల వయసులో మరణించారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో ఆయనకు దాదాపు 0.83% వాటాలు ఉన్నాయి. అతని మొత్తం సంపద సుమారు రూ.8,000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీనికి తోడు ఇతర ఆస్తులు, రతన్ టాటా పెట్టుబడులను పరిగణిస్తే మెుత్తం సంపద విలువ ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications