స్టాక్ మార్కెట్లపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య ఈ మధ్యకాలంలో క్రమంగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టే అంత పరిజ్ఞానం లేని వారు మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటున్నారు. ఈ సంస్థలు రిటైల్ ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణమైన పథకాలను తీసుకువస్తున్నాయి. ఈ సంస్థలు అందించే క్రమానుగత పెట్టుబడి ప్లాన్ల (సిప్) వల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నారు. సిప్ పెట్టుబడుల్లో ధోరణులను పరిశీలిస్తే వీటిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను చూసుకోవచ్చు.
అక్టోబర్ లో రూ.8,246 కోట్లు
* సిప్ ల ద్వారా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ గత అక్టోబర్ లో 8,246 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలతో పోల్చితే ఈ పెట్టుబడులు 3.2 శాతం మేర పెరిగాయి.

* ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు స్టాక్ మార్కెట్లో దూసుకుపోవడానికి దోహదపడినాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు.
* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు సిప్ పెట్టుబడులు 52,472 కోట్ల నుంచి 57,607 కోట్లకు పెరిగాయి.
* రిస్క్ తక్కువగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు సిప్ లకు ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
* ప్రస్తుతం 44 కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ ను అందిస్తున్నాయి. ఈ సంస్థలు సిప్ ల ద్వారా గత సెప్టెంబర్ లో 8,263 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆగస్టులో 8,231 కోట్లు, జులై లో 8,324 కోట్లు, జూన్ లో 8,122 కోట్లు, మే లో 8,183 కోట్లు, ఏప్రిల్ లో 8,238 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* అక్టోబర్ తో ముగిసిన పన్నెండు నెలల కాలాన్ని పరిశీలిస్తే సిప్ లోకి వచ్చిన సగటు పెట్టుబడులు 8,000 కోట్లుగా ఉన్నాయి.
* పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్ల సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తోంది.
మార్కెట్ల పని తీరు మెరుగు...
దేశ ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి మందగిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వం పలు రకాల ఉద్దీపనలు ప్రకటిస్తోంది. వీటి ప్రభావం రానున్న కాలంలో సానుకూలంగగా ఉంటుందని.. దీంతో మార్కెట్లు మరింత ముందడుగు వేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
* ఫలితంగా సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరుగుతాయంటున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు బీఎస్ఈ దాడ్పు నాలుగు శాతం వరకు పెరిగింది.
గత మూడేళ్ళలో...
* గత మూడేళ్ళ నుంచి సిప్ ల ద్వారా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇవి సిప్ లకు ఉన్న ఆదరణను తెలియజేస్తున్నాయి.
* 2018-19 లో 92,700 కోట్లు, 2017-18లో 67,000 కోట్లు, 2016-17లో 43,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* ప్రస్తుతం సిప్ ఖాతాలు 2.89 కోట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు.
* ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సగటున నెలలో 9.35 లక్షల సిప్ ఖాతాలను జతచేసుకున్నాయి. వీటి సగటు పెట్టుబడుల మొత్తం 2,850 రూపాయలుగా ఉంది.
* అక్టోబర్ చివరి నాటికీ మ్యూచువల్ ఫండ్ కంపెనీల మొత్తం ఆస్తులు 26 లక్షల కోట్లకు పెరిగాయి.
సిప్ పెట్టుబడి ఇలా..
* సిప్ ల ద్వారా ఇన్వెస్టర్లు ఒక్కసారి భారీగా కాకుండా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లు వారం, నెల లేదా మూడు నెలలకు ఒక్కసారీ పెట్టుబడులు పెట్టవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లాంటిదే.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications