Investment: ఈ షేర్లను మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అమ్మేస్తున్నాయ్.. జాగ్రత్త
Investment: గత కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్ల బుల్ రన్ కొనసాగిస్తున్నాయి. మధ్యలో ఒడిదొడుకుల వల్ల కొన్ని ట్రేడింగ్ సెషన్లలో స్వల్పంగా నష్టాలను నమోదు చేసినప్పటికీ.. మార్కెట్ల ప్రయాణం పైపైకి కొనసాగుతోంది.
అయితే ప్రస్తుతం మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలకు కేవలం 1-2 శాతం దూరంలోనే ఉన్నాయి. FIIల కొనుగోళ్లు కొనసాగంతో జోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో జాగ్రత్తలో భాగంగా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు కొన్ని కంపెనీల్లో తమ ఈక్వీటీ పెట్టుబడులను తగ్గిస్తున్నారు. ఇందులో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ విక్రయించిన టాప్-10 లార్జ్క్యాప్ స్టాక్ల జాబితా గురించి ఇప్పుడు తెలుసుకోండి.

ఒకవేళ మార్కెట్లు బేజారి బేర్స్ రంగంలోకి దిగితే కరెక్షన్ జరిగే అవకాశం ఉందని మ్యూచువల్ ఫండ్ మేనేజర్లతో పాటు పెట్టుబడి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా తమ పెట్టుబడి విలువను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే రిటైల్ పెట్టుబడిదారులు సైతం తమ పోర్ట్ ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.
ముందుగా టెక్ కంపెనీ విప్రో షేర్లను 17 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ తమ పెట్టుబడులను విక్రయించాయి. టాటా స్టీల్ కంపెనీ షేర్ల నుంచి 16 ఫండ్స్ బయటకు వచ్చేశాయి. ఫార్మా దిగ్గజం సిప్లా షేర్లను 15 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పోర్ట్ ఫోలియో నుంచి తగ్గించుకున్నాయి. అలాగే అదానీ గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్ స్టాక్ లను 14 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు విక్రయించాయి. దేశీయ దిగ్గజ కార్ల విక్రయదారు మారుతీ సుజుకీ ఇండియా షేర్ల నుంచి 14 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నిష్క్రమించాయి.
బిర్లాలకు చెందిన అల్యూమినియం సంస్థ హిందాల్కొ ఇండస్ట్రీస్ షేర్లను 13 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు అమ్మేశాయి. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లను 12 స్కీమ్స్ నిష్క్రమించాయి. యూపీఎల్ కంపెనీ షేర్లను 12 ఫండ్స్ తగ్గించుకున్నాయి. డీమార్ట్ స్టోర్ల మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్ షేర్లను 11 MF స్కీమ్స్ వదిలిచ్చుకోగా.. HCL టెక్నాలజీస్ షేర్లను 11 స్కీమ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను 11 స్కీమ్స్ విక్రయించాయి.


Click it and Unblock the Notifications