Bonus Multibagger: కరోనా కల్లోలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోని చాలా కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. అయితే ఆ తర్వాత మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తూ దూసుకుపోతున్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన రాబడిని అందించిన కంపెనీల్లో ఒకటిగా నిలిచిన JTL ఇండస్ట్రీస్ గురించే. గత 3 ఏళ్లలో కంపెనీ షేర్ ధర 2,300 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్ కరోనా మహమ్మారి తర్వాత ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడిని అందించింది. తాజాగా ఈ మల్టీబ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.

జూలై 29, 2023న కంపెనీ బోర్డు మీటింగ్ జరగనుందని JTL ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్ లో వెల్లడించింది. ఈ క్రమంలో బోనస్ షేర్లపై నిర్ణయం తీసుకోనుంది. బోనస్ షేర్లను ప్రకటిస్తే.. అదే రోజున రికార్డు తేదీ తదితర వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. గడచిన నెలరోజుల్లో స్టాక్ ధర 9 శాతానికి పైగా పెరిగింది. అలాగే ఆరు నెలల కిందట కంపెనీ షేర్లలో పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లు 16 శాతానికి పైగా రాబడిని పొందారు.
JTL ఇండస్ట్రీస్ షేర్ ధరలు గత ఏడాది కాలంలో 22 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.358గా ఉంది. ఇదే క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.372.80గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 282 వద్ద ఉంది. ఈక్రమంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ JTL ఇండస్ట్రీస్ కంపెనీ స్టాక్పై 'BUY' రేటింగ్ను ఇచ్చింది.
JTL ఇండస్ట్రీస్ వ్యూహాత్మకంగా ఉన్న ప్లాంట్లు, దూకుడు సామర్థ్యం విస్తరణ, విలువ జోడింపు ప్రణాళిక ద్వారా విస్తృత పంపిణీదారులను కలిగి ఉంది. దేశంలో నాలుగు తయారీ కేంద్రాలను కలిగి ఉన్న కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలోనూ కస్టమర్లను కలిగి ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications