Reliance Group: ముఖేష్ అంబానీ తన సాంప్రదాయ వ్యాపారాలను ప్రస్తుతం న్యూ ఏజ్ టెక్నాలజీల వైపుకు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ నుంచి సోలార్ వరకు అనేక రంగాల్లో ఉన్న వ్యాపార అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన పాదముద్రను అనేక రంగాల్లోకి విస్తరిస్తూ ముందుకు సాగుతోంది.
తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుభంద సంస్థగా ఉన్న రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ లిమిటెడ్ అధునాతన సాంకేతికతతో కెమికల్ సెల్స్ తయారీకి భారత ప్రభుత్వం నుంచి పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నుంచి ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహకాలను అందించే స్కీమ్ కింద కాంట్రాక్టును రిలయన్స్కి అందించబడింది. దీనికింద రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు రూ.3,620 కోట్లను ప్రోత్సాహకాల రూపంలో పొందనుందని వెల్లడైంది.

వాస్తవానికి ఉప్పత్తి ఆథారిత ప్రోత్సాహకాల కింద కేంద్ర ప్రభుత్వం రూ.18,100 కోట్లను అందించాలని నిర్ణయించింది. అయితే ఈ స్కీమ్ కింద ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ లిమిటెడ్ దాదాపు 10 గిగావాట్ అవర్ సామర్థ్యం కలిగిన అడ్వాన్స్డ్ కెమికల్ సెల్స్ తయారీ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వెల్లడైంది. అధునాతన కెమిస్ట్రీ సెల్స్ విద్యుత్ శక్తిని ఎలక్ట్రోకెమికల్ లేదా రసాయన శక్తిగా నిల్వ చేయగలవు. ఆ ఎనర్జీని అవసరమైనప్పుడు తిరిగి విద్యుత్ శక్తిగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఈ బ్యాటరీలను తయారు చేయటానికి 2021 మే నెలలో ప్రభుత్వం దేశీయంగా పీఎల్ఐ స్కీమ్ కింద 50 గిగావాట్ అవర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించటం కోసం క్యాబినెట్ ప్రతిపాదనలో వెల్లడించింది. దీని తర్వాత 10 GWh బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి 7 బిడ్డర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెండర్ విజేతగా నిలిచిందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2024 సెప్టెంబర్ 4న ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో కలిపి నాలుగు సంస్థలు ఈ స్కీమ్ కింద బ్యాటరీలను తయారు చేయటానికి అర్హతను పొందాయని వెల్లడైంది.
2022లో భారత ప్రభుత్వం 5 గిగావాట్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి, 20 గిగావాట్ అవర్ కెపాసిటీని ఓలా ఎలక్ట్రిక్ కి, మరో 5 గిగావాట్ అవర్ రాజేష్ ఎక్స్ పోర్ట్స్ కంపెనీలకు అందించింది.
భారత ప్రభుత్వం శిలాజ ఇంధనాలపై నడిచే వాహనాల నుంచి ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్లించే క్రమంలో ఈవీలను ప్రోత్సహిస్తున్న వేళ ఈ రంగానికి అవసరమైన బ్యాటరీ టెక్నాలజీలను కూడా చురుకుగా ప్రోత్సహిస్తోంది. విద్యుత్ వాహనాల బ్యాటరీల ఉత్పత్తికి అవసరమైన 35 వస్తువులపై ఇంపోర్ట్ డ్యూటీని కూడా కేంద్రం ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు దేశంలోని జమ్ముకశ్మీర్ ప్రాంతంలో గత ఏడాది లిథియం గుర్తించబడటం దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా నడిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications