వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఏంటంటే దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో లిస్టులో చోటు కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆయన నికర ఆస్తుల విలువ లక్ష కోట్లు తగ్గడంతో ఇలా జరిగింది. ఈ సమాచారం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ద్వారా వెల్లడైంది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎప్పటిలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఆయన మొత్తం సంపద ప్రస్తుతం 420 బిలియన్ డాలర్లు. ఐటీ కంపెనీ HCLకి చెందిన రోష్ని నాడార్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ ధనవంతురాలైన మహిళగా నిలిచారు. ఆమె ఆస్తులు రూ.3.5 లక్షల కోట్లకు పైమాటే. ప్రపంచంలోని టాప్ 10 మహిళలలో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ కూడా రోష్ని నాడార్. ఆమె తండ్రి శివ్ నాడార్ ఆమెకి HCLలో 47% వాటాను ఇచ్చాడు.

ముఖేష్ అంబానీ ఇప్పటికీ భారతదేశం అలాగే ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ప్రస్తుతం అంబానీ కుటుంబం ఆస్తుల విలువ 8.6 లక్షల కోట్లు. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే అతని సంపద దాదాపు 13 శాతం అంటే రూ. లక్ష కోట్లు తగ్గింది. మరోవైపు గౌతమ్ అదానీ ఇంకా అతని కుటుంబ సంపద 13% పెరిగింది. గత ఏడాది కాలంలో అదానీ నికర ఆస్తుల విలువ లక్ష కోట్లు పెరిగింది. 8.4 లక్షల కోట్ల నికర ఆస్తితో భారత ధనవంతుల లిస్టులో గౌతమ్ అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. ఈ లిస్టులో రోష్ని నాడార్ అండ్ ఆమె కుటుంబం మూడవ స్థానంలో ఉంది. విశేషం ఏంటంటే ఆమె ఈ లిస్టులో తొలిసారిగా చోటు సంపాదించింది.
టాప్ 10 లో ఎవరు ఉన్నారు: సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ సంపద 21% పెరిగి ఇప్పుడు అతని సంపద రూ.2.5 లక్షల కోట్లుగా ఉంది. అతను ఈ లిస్టులో నాల్గవ స్థానాల్లో ఉన్నారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ రూ.2.2 లక్షల కోట్లతో ఐదవ స్థానంలో, కుమార్ మంగళం బిర్లా రూ.2 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉండగా 2 లక్షల కోట్ల నికర విలువతో సైరస్ పూనావాలా ఆరో స్థానంలో ఉన్నారు. గత ఏడాది కాలంలో ఆయన నికర ఆస్తులు 8 శాతం తగ్గాయి.
బజాజ్ ఆటోకు చెందిన నీరజ్ బజాజ్ రూ.1.6 లక్షల కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉండగా, రవి జైపురియా అండ్ రాధాకిషన్ దమాని రూ.1.4 లక్షల కోట్లతో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు. ఒక్క ముంబైలోనే అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉండగా, టాప్ 10 బిలియనీర్లలో ఐదుగురు ముంబైకి చెందినవారే. న్యూఢిల్లీలో ఇద్దరు బిలియనీర్లు ఉండగా బెంగళూరు, అహ్మదాబాద్ ఇంకా పూణేలలో ఒక్కొక్క బిలియనీర్ ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications