Ambani News: అంబానీ ఆర్థిక పాఠాలు.. క్లీన్ ఎనర్జీ భవిష్యత్తుపై కీలక కామెంట్స్

Ambani News: మారుతున్న కాలానికి అనుగుణంగా, వినియోగించే ఇంధనంలోనూ భారీ మార్పులు జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాడకం నుంచి క్రమేపీ క్లీన్ ఎనర్జీ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ స్వచ్ఛ ఇంధనం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కనున్నట్లు ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమున్న 3.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ వృద్ధి ప్రయాణంలో స్వచ్ఛ ఇంధన వనరులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ మేరకు పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ హోదాలో గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఇచ్చిన సందేశంలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Mukesh Ambani shared his views on Clean Energy contribution in India Economic growth

ఈ దశాబ్దం చివరి నాటికి దేశీయ ఇంధన అవసరాలు రెట్టింపు అవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు డిమాండ్‌ను అందుకునేందుకు.. భారత్ మౌలిక సదుపాయాల కల్పన దిశగా పోటీ పడుతుందన్నారు. ప్రతి పౌరుడికీ, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు అత్యంత చవకైన ఇధనం అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.

ఇంధన పరివర్తనలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి స్మార్ట్ మరియు స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయగల సత్తా భారత్‌ కు ఉందన్నారు. భారత్‌ లోని అత్యంత ప్రతిభావంతులైన యువతపై తనకు నమ్మకం ఉన్నట్లు చెప్పారు. కొన్నిసార్లు భంగపడినా, తిరిగి ధైర్యంగా లక్ష్యం వైపు కొనసాగే ఆత్మవిశ్వాసం వారిలో ఉందన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+