టాప్ 6 క్లబ్లోకి... BPని దాటివేసిన ముఖేష్ అంబానీ రిలయన్స్
న్యూఢిల్లీ: ఆయిల్, టెలికం మొదలు రిటైల్ రంగం వరకు వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉనన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో ఘనత సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లకు చేరుకుంది. నవంబర్ 19న ట్రేడింగ్లో RIL షేర్లు ఇంట్రాడేలో గరిష్టంగా 3.87 శాతం లాభపడి, రూ.1500కు చేరుకుంది. బుధవారం (20 నవంబర్ 2019) తేదీ కూడా ఈ షేర్ దూసుకెళ్లింది. మధ్యాహ్నం గం.12 సమయానికి రూ.52.40 (3.47%) పెరిగి రూ.1,562.15కు చేరుకుంది. ప్రపంచంలోని ఆరు సూపర్ మేజర్ ఆయిల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది
దూసుకెళ్లిన రిలయన్స్ షేరు.. మార్కెట్ క్యాప్లో దేశంలోనే నంబర్ వన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ వ్యాల్యూ గడిచిన ఏడాది కాలంలో 35 శాతానికి పైగా లాభపడింది. రిలయన్స్ షేర్ ధర మంగళవారం గరిష్టంగా రూ.1514 తాకింది. అనంతరం బీఎస్ఈలో మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర రూ.1510 వద్ద స్థిరపడింది. బుధవారం రూ.1562ను తాకింది. డాలర్ మారకంలో రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ 133 బిలియన్ డాలర్లుగా ఉంది. తద్వారా బ్రిటిషన్ ఎనర్జీ దిగ్గజం BPని దాటివేసింది. BP మార్కెట్ క్యాప్ 132 బిలియన్ డాలర్లు.
రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ గత నెలలో తొలిసారి BPని క్రాస్ చేసింది. ఇప్పుడు మరోసారి దాటింది. మార్కెట్ క్యాప్ ప్రకారం చైనా అతిపెద్ద చమురు సంస్థ పెట్రో చైనా-కోకు సమీపంలో రిలయన్స్ ఉంది. రానున్న 18 నెలల్లో కంపెనీ రుణాలను జీరోగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేష్ అంబానీ ఆగస్ట్ నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, సౌదీ ఆరామ్కోతో కలిసి సాగనుంది. షేర్ల ధర పెరుగుదలతో అంబానీ నెట్ వర్త్ 56 బిలియన్ డాలర్లు పెరుగుతుంది.